ఈ రోజు ఉదయం 11.30 గంటలకు విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. కానీ అధికారులు చెప్పిన సమయం దాటిన వెబ్ సైట్ మాత్రం ఓపెన్ కాలేదు. తర్వాత ఓపెన్ అయ్యింది. దీంతో కాసేపు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. టెట్ ఫలితాల విడుదలలో అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫలితాలను విద్యాశాఖ ఒకే వెబ్ సైట్ కు లింక్ చేసిందని.... గతంలో రెండు లేదా మూడు వెబ్ సైట్ లో ఫలితాలు విడుదల చేసేవారని వారు ఆరోపిస్తున్నారు. టెట్ లో ఎంత మంది క్వాలిఫై అయ్యారో కనీసం మీడియాకి కూడా సమాచారం ఇవ్వలేదని అభ్యర్థులు విద్యా శాఖపై విమర్శలు చేశారు.

0 Comments:
Post a Comment