రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి హైకోర్టు ఒకేసారి ఆరు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ విభాగాల్లో మొత్తం 1,904 పోస్టుల భర్తీకి సోమవారం నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా ఈ నెల11వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 31వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ ముగుస్తుంది.
ఫిబ్రవరి 15వ తేదీ నుంచి హాల్టికెట్లను వైబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మార్చిలో ఆయా పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ నిర్వహిస్తారు. పరీక్ష తేదీలను త్వరలో ప్రకటిస్తామని హైకోర్టు రిజిస్ట్ట్రార్ తెలిపారు. ఖాళీల వివరాలు, రిజర్వేషన్లు, విద్యార్హతలు ఇతర పూర్తి వివరాలకు హైకోర్టు అధికారిక వెబ్సైట్ http;//tshc.gov.in ను సందర్శించవచ్చు. అనుమానాలను నివృత్తి చేసుకొనేందుకు helpdesk-tshc@telangana.gov.in ఈ-మెయిల్లో సంప్రదించొచ్చు. 040- 23688394 నంబర్కు హైకోర్టు పని దినాల్లో ఫోన్ చేసి కూడా తమ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు అని నోటిఫికేషన్లలో పేరొన్నారు.
టెన్త్ అర్హతతో కోర్టుల్లో ఉద్యోగాలు.. వేతనం గరిష్టంగా 58 వేలు
Posted by eGURUm tv on Monday, January 9, 2023
You may also like these Posts
Blog, Updated at: January 09, 2023

0 Comments:
Post a Comment