తెలంగాణలో గ్రూప్-2 (TSPSC Group 2) పరీక్ష మళ్లీ వాయిదా పడింది. జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు TSPSC బుధవారం రాత్రి ప్రకటించింది. పరీక్ష తేదీలను తర్వాత వెల్లడిస్తామని స్పష్టం చేసింది. మొత్తం 783 గ్రూప్- 2 పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.
తొలుత విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్ -2 పరీక్ష జరగాల్సి ఉండగా.. అప్పుడు వరుసగా ఇతర పోటీ పరీక్షలు ఉండటంతో గ్రూప్ -2 పరీక్ష వాయిదా వేయాలంటూ అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు ఆందోళనలతో వాయిదా పడ్డాయి. ఆ తర్వాత నవంబర్ 2, 3 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న వేళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రావడంతో రెండోసారి వాయిదా వేశారు. తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించడం, TSPSC ఛైర్మన్, సభ్యుల రాజీనామాల నేపథ్యంలో నెలకొన్న తాజా పరిస్థితులతో మరోసారి గ్రూప్-2 పరీక్షలు వాయిదా పడ్డాయి.
Shireesha thota
ReplyDelete