CTET - 2022 Public Notice in Telugu || CTET 2022 Notification in Telugu

No.: CBSE/CTET/Dec-2022                                                                        Dated: 14.07.2022

PUBLIC NOTICE 

The Central Board of Secondary Education will conduct the 16th edition of Central Teacher Eligibility Test (CTET) in CBT (Computer Based Test) mode in December 2022(exact date will be intimated on the admit card of the candidate). The test will be conducted in 20 (Twenty) languages throughout the country. The detailed Information Bulletin containing details of examination, syllabus, languages, eligibility criteria, examination fee, examination cities and important dates will be available on CTET official website https://ctet.nic.in shortly and the aspiring candidates are requested to download the Information Bulletin from the above mentioned website only and read the same carefully before applying. The aspiring candidates have to apply online only through CTET website i.e. https://ctet.nic.in. The dates for online application-process will be intimated during the course of time. 

 The application fee applicable for CTET Dec-2022 is as under: 

  • Only Paper I or II : 
General/OBC Rs. 1000/-

SC/ST/Diff. Abled Person Rs. 500/-

  • Both Paper I & II 
 General/OBC Rs. 1200/-

 SC/ST/Diff. Abled Person Rs. 600/- 


భారత దేశాన్ని ఎవరు? ఎప్పుడు పరిపాలించారు? పూర్తి సమాచారం.

*బానిస రాజవంశం*
1 = 1193 ముహమ్మద్ ఘోరి
2 = 1206 కుతుబుద్దీన్ ఐబాక్
3 = 1210 అరామ్ షా
4 = 1211 ఇల్టుట్మిష్
5 = 1236 రుక్నుద్దీన్ ఫిరోజ్ షా
6 = 1236 రజియా సుల్తాన్
7 = 1240 ముయిజుద్దీన్ బహ్రమ్ షా
8 = 1242 అల్లావుద్దీన్ మసూద్ షా
9 = 1246 నాసిరుద్దీన్ మెహమూద్
10 = 1266 గియాసుడిన్ బల్బన్
11 = 1286 కై ఖుష్రో
12 = 1287 ముయిజుద్దీన్ కైకుబాద్
13 = 1290 షాముద్దీన్ కామర్స్
1290 బానిస రాజవంశం ముగుస్తుంది
(ప్రభుత్వ కాలం - సుమారు 97 సం.)

*ఖిల్జీ రాజవంశం*
1 = 1290 జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ
2 = 1296 అల్లాదీన్ ఖిల్జీ
4 = 1316 సహబుద్దీన్ ఒమర్ షా
5 = 1316 కుతుబుద్దీన్ ముబారక్ షా
6 = 1320 నాసిరుదిన్ ఖుస్రో షా
7 = 1320 ఖిల్జీ రాజవంశం ముగిసింది
(ప్రభుత్వ కాలం - సుమారు 30 సం.)

*తుగ్లక్ రాజవంశం*
1 = 1320 గయాసుద్దీన్ తుగ్లక్ I.
2 = 1325 ముహమ్మద్ బిన్ తుగ్లక్ రెండవ
3 = 1351 ఫిరోజ్ షా తుగ్లక్
4 = 1388 గయాసుద్దీన్ తుగ్లక్ రెండవ
5 = 1389 అబూబకర్ షా
6 = 1389 ముహమ్మద్ తుగ్లక్ మూడవ
7 = 1394 సికందర్ షా మొదటి
8 = 1394 నాసిరుదిన్ షా దుస్రా
9 = 1395 నస్రత్ షా
10 = 1399 నాసిరుద్దీన్ మహమ్మద్ షా వెంటాడే రెండవ స్థానంలో ఉన్నారు
11 = 1413 డోలత్ షా
1414 తుగ్లక్ రాజవంశం ముగుస్తుంది
(ప్రభుత్వ కాలం - సుమారు 94 సం.)

*సయ్యిద్ రాజవంశం*
1 = 1414 ఖిజ్ర్ ఖాన్
2 = 1421 ముయిజుద్దీన్ ముబారక్ షా రెండవ
3 = 1434 ముహమ్మద్ షా నాల్గవ
4 = 1445 అల్లావుద్దీన్ ఆలం షా
1451 సయీద్ రాజవంశం ముగుస్తుంది
(ప్రభుత్వ కాలం - సుమారు 37 సం.)

*అలోడి రాజవంశం*
1 = 1451 బహ్లోల్ లోడి
2 = 1489 అలెగ్జాండర్ లోడి రెండవది
3 = 1517 ఇబ్రహీం లోడి
1526 లోడి రాజవంశం ముగుస్తుంది
(ప్రభుత్వ కాలం - సుమారు 75 సం.)

*మొఘల్ రాజవంశం*
1 = 1526 జహ్రుదిన్ బాబర్
2 = 1530 హుమయూన్
1539 మొఘల్ రాజవంశం సమయం ముగిసింది

*సూరి రాజవంశం*
1 = 1539 షేర్ షా సూరి
2 = 1545 ఇస్లాం షా సూరి
3 = 1552 మహమూద్ షా సూరి
4 = 1553 ఇబ్రహీం సూరి
5 = 1554 ఫిరుజ్ షా సూరి
6 = 1554 ముబారక్ ఖాన్ సూరి
7 = 1555 అలెగ్జాండర్ సూరి
సూరి రాజవంశం ముగుస్తుంది, (పాలన -16 సంవత్సరాలు సుమారు)

*మొఘల్ రాజవంశం పున ప్రారంభించబడింది*
1 = 1555 హుమాయున్ మళ్ళీ సింహాసనం పైన
2 = 1556 జలాలుద్దీన్ అక్బర్
3 = 1605 జహంగీర్ సలీం
4 = 1628 షాజహాన్
5 = 1659 u రంగజేబు
6 = 1707 షా ఆలం మొదట
7 = 1712 జహదర్ షా
8 = 1713 ఫరూఖ్సియార్
9 = 1719 రైఫుడు రజత్
10 = 1719 రైఫుడ్ దౌలా
11 = 1719 నెకుషియార్
12 = 1719 మహమూద్ షా
13 = 1748 అహ్మద్ షా
14 = 1754 అలమ్‌గీర్
15 = 1759 షా ఆలం
16 = 1806 అక్బర్ షా
17 = 1837 బహదూర్ షా జాఫర్
1857 మొఘల్ రాజవంశం ముగుస్తుంది
(ప్రభుత్వ కాలం - సుమారు 315 సంవత్సరాలు.)

*బ్రిటిష్ రాజ్ (వైస్రాయ్)*
1 = 1858 లార్డ్ క్యానింగ్
2 = 1862 లార్డ్ జేమ్స్ బ్రూస్ ఎల్గిన్
3 = 1864 లార్డ్ జాహోన్ లోరెన్ష్
4 = 1869 లార్డ్ రిచర్డ్ మాయో
5 = 1872 లార్డ్ నార్త్‌బుక్
6 = 1876 లార్డ్ ఎడ్వర్డ్ లాటెన్లార్డ్
7 = 1880 లార్డ్ జార్జ్ రిపోన్
8 = 1884 లార్డ్ డఫెరిన్
9 = 1888 లార్డ్ హన్నీ లాన్స్‌డన్
10 = 1894 లార్డ్ విక్టర్ బ్రూస్ ఎల్గిన్
11 = 1899 లార్డ్ జార్జ్ కర్జన్
12 = 1905 లార్డ్ టివి గిల్బర్ట్ మింటో
13 = 1910 లార్డ్ చార్లెస్ హార్డింగ్
14 = 1916 లార్డ్ ఫ్రెడరిక్ సెల్మ్స్ఫోర్డ్
15 = 1921 లార్డ్ రూక్స్ ఐజాక్ రైడింగ్
16 = 1926 లార్డ్ ఎడ్వర్డ్ ఇర్విన్
17 = 1931 లార్డ్ ఫ్రీమాన్ వెల్లింగ్డన్
18 = 1936 లార్డ్ అలెగ్జాండర్ లిన్లిత్గో
19 = 1943 లార్డ్ ఆర్కిబాల్డ్ వేవెల్
20 = 1947 లార్డ్ మౌంట్ బాటన్

*బ్రిటిషర్స్ పాలన సుమారు 90 సంవత్సరాలు ముగిసింది.*

*ఆజాద్ ఇండియా, ప్రధాని*
1 = 1947 జవహర్‌లాల్ నెహ్రూ
2 = 1964 గుల్జారిలాల్ నందా
3 = 1964 లాల్ బహదూర్ శాస్త్రి
4 = 1966 గుల్జారిలాల్ నందా
5 = 1966 ఇందిరా గాంధీ
6 = 1977 మొరార్జీ దేశాయ్
7 = 1979 చరణ్ సింగ్
8 = 1980 ఇందిరా గాంధీ
9 = 1984 రాజీవ్ గాంధీ
10 = 1989 విశ్వనాథ్ ప్రతాప్సింగ్
11 = 1990 చంద్రశేఖర్
12 = 1991 పివి నరసింహారావు
13 = అటల్ బిహారీ వాజ్‌పేయి
14 = 1996 H.D. దేవేగౌడ
15 = 1997 ఐకె గుజ్రాల్
16 = 1998 అటల్ బిహారీ వాజ్‌పేయి
17 = 2004 డాక్టర్ మన్మోహన్ సింగ్
*18 = 2014 నుండి నరేంద్ర మోడీ*

*764 సంవత్సరాల తరువాత, పరదేశీ మరియు బ్రిటిష్ వారి బానిసత్వం నుండి స్వేచ్ఛ పొందబడింది.*

*ఈ ముఖ్యమైన సమాచారాన్ని యువకులందరి దృష్టిలో వీలైనన్ని సమూహాలలో పంపండి...*

*మనం 1000 సంవత్సరాలు కొన్ని కోట్ల మంది పోరాటం ఫలితంగా ఈ దేశం ఇంకా  దేశంగా మనుగడలో ఉన్నది.*


*మన భారతీయ సంస్కృతి ని, ధర్మాన్ని అనుసరించి, కాపాడుకోవాలి. స్థిరంగా, దృఢంగా అభివృద్ధి సాధించాలి.*


చదువుకోండి చరిత్ర కోసం తెలుసుకోండి మరో పదిమందికి షేర్ చెయ్యండి.

ఒక ప్రభుత్వ టీచర్ చేసిన విశ్లేషణ .. తప్పకుండా ఆలోచించాల్సిన అంశాలు ......

ప్రభుత్వ విద్యా వ్యవస్థ, ప్రైవేటు విద్యా వ్యవస్థ మధ్య పోటీలో..* ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎలా *బలిపశువులు* చేసి చూపుతున్నారో, వాళ్ళు అలా ఎందుకు బలికావాల్సి వస్తుందో వివరించే *ప్రయత్నం నాది...*

       కొంత హిస్టరీలో కి వెళ్దాం... 

       30 సంవత్సరాలకు పూర్వం *అందరూ* ప్రభుత్వ పాఠశాలలోనే విద్య అభ్యసించేవారు. 

       *డాక్టర్ కొడుకైనా, లాయర్ కొడుకైనా, ఇంజనీర్ కొడుకైన, టీచర్ కొడుకైనా, రాజకీయ నాయకుడి కొడుకైనా, రైతు కొడుకైనా, కూలి కొడుకైన ఎవరైనా ఒకే పాఠశాలలోనే చదవాల్సిందే..* 

       *అప్పుడు పాఠశాలలన్నీ తెలుగు మీడియంలోనే ఉండేవి..* 

       దాదాపు ప్రతి గ్రామంలోనూ పాఠశాలలు విద్యార్థులతో కిటకిటలాడేవి. 

       అప్పుడు కూడా *విద్యార్థులకు సరిపడే టీచర్లు కూడా ఉండేవారు కాదు.* 

       ఏ కొంత మంది విద్యార్థులకో *ప్రత్యేక తర్ఫీదు* లు ఉండేవి కాదు.  

       కానీ విద్యార్థులు వారి యొక్క సామర్ధ్యాన్ని బట్టి ముందు తరగతులకు వెళ్తూ ఉండేవారు. 

       తెలివైన విద్యార్థులు 5 నుండి 10 శాతం మంది ఉన్నత తరగతులు చదువుతూ కాలేజీల్లోనూ.. యూనివర్సిటీల్లోని సీట్లు సంపాదిస్తూ ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళేవారు. 

       మిగతా 90 శాతం మంది విద్యార్థుల్లో ప్రాథమిక విద్యలో విద్యను ఆపేసిన వారు కొందరు, హైస్కూల్ స్థాయిలో విద్యను ఆపేసిన వారు కొందరు, కాలేజీ స్థాయిలో కొందరు, రకరకాల వృత్తులో స్థిరపడిన వారు కొందరు ఉండేవారు. 

       *అలా ఉన్న 90 శాతం మందిలో ఏ ఒక్కరు కూడా ఆ పాఠశాల వలనే మాకు చదువు రాలేదు అని ఎవరూ అనలేదు.* 

       *మేము చదువు మీద సరైన శ్రద్ధ చూపలేదు అని మాత్రమే అనేవారు.* 

       *వారికి చదువు చెప్తున్న ఏ ఉపాధ్యాయుని కూడా నిందించే వారు కూడా కాదు.* 

       తర్వాత *వాస్తవం లోకి వెళ్దాం ...*

       కాలంతో పాటు జనాభా కూడా పెరుగుతోంది. *గ్రామాల్లోని విద్యార్థులకు కూడా చదువుకోవాలనే ఆసక్తి పెరిగింది*. 

       కానీ ప్రాథమిక విద్య తర్వాత హైస్కూల్ లో జాయిన్ చేయడానికి అందుబాటులో లేక చదువు మానేసిన వాళ్లు కొందరు. 

       దీనికి *కారణం ఉపాధ్యాయులా? ప్రభుత్వమా?* 

       ఏదోలా దూరాన ఉన్న హై స్కూల్లో చేరి హైస్కూలు చదువు పూర్తి చేసిన తర్వాత జూనియర్ కాలేజీలో చేరుదామనుకుంటే *రెండు, మూడు మండలాలకు కలిపి ఒక జూనియర్ కళాశాల దానిలో 100 నుంచి 200 సీట్లు ఉండేవి*. 

       *మరి మిగతా విద్యార్థుల పరిస్థితి ఏంటి ? ప్రభుత్వాలు వాళ్లకి ఎందుకు చదువుకునే అవకాశాలు కల్పించలేకపోయింది?*

       అప్పుడే విద్యార్థులు అవసరాలకు అనుగుణంగా ప్రైవేట్ కళాశాలలు పుట్టుకొచ్చాయి. 

       ప్రభుత్వం కూడా *తన భారం తగ్గుతుంది కదా* అని పర్మిషన్ లు కూడా ఇచ్చేసేది. 

       కానీ *ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు రాని వాడు మాత్రమే ప్రైవేటు కళాశాలలో జాయిన్ అయ్యే వారు*. 

       కానీ ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు రాని వారి సంఖ్య పెరుగుతూ పోయింది. 

       కానీ *ప్రభుత్వ కళాశాలలు పెరగలేదు. వాటిల్లో సీట్ల సంఖ్య పెరగలేదు.* 

       ప్రైవేటు కళాశాలల సంఖ్య మాత్రం వారికి అనుగుణంగా పెరుగుతూ పోయింది. 

       *రేకుల షెడ్ ల లో నడుస్తున్న అపార్ట్ మెంట్ ల లో నడుస్తున్నా.. విద్యా ప్రమాణాలు పాటించకున్నా..* ప్రభుత్వం *తన మీద భారం లేదు కదా* అనుకుంటూ పర్మిషన్ ఇచ్చుకుంటూ పోయింది.

       మరి ప్రాథమిక విద్య లో విద్యార్థులను ఆకర్షించడం ఎలా..? 

       వాళ్ల దగ్గర లేనిది మన దగ్గర ఏముంది?

       దానికి *సమాధానమే ఇంగ్లీష్ మీడియం...*

       ఇబ్బడి ముబ్బడిగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్రారంభమయ్యాయి...  

కాస్త ధనవంతులు ఉన్నత తరగతి వ్యక్తులందరూ అటు వైపు ఆకర్షింపబడ్డారు. 

       ప్రభుత్వం *ప్రాథమిక విద్యని మాతృభాషలోనే బోధించాలని రూల్* ఏమి పెట్టలేదు. 

       అడిగిన వాళ్లందరికీ ఇంగ్లీష్ మీడియం *పర్మిషన్* ఇచ్చేసింది.

       కానీ *ఏ ఒక్క గవర్నమెంట్ స్కూల్లోనే ప్రత్యేకంగా ఇంగ్లీష్ మీడియం పెట్టలేదు.* 

       ప్రభుత్వం మీద భారం లేకుండా ఎవరికి వారే కదా డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రైవేట్ గా చదివేస్తున్నారు.  

       *ప్రభుత్వానికి చాలా సంతోషించదగ్గ విషయమే కదా..! ప్రభుత్వ ఖర్చు లేకుండా ప్రజలు విద్యావంతులై పోతుంటే..!!*

       అలా ఉన్నత, మధ్య తరగతి విద్యార్థులు *ప్రైవేట్ స్కూల్* వైపు వెళ్ళిపో సాగారు. అది సమాజం లో *స్టేటస్ సింబల్* గా మారిపోయింది.  

       *‌ప్రభుత్వ పాఠశాలలు క్రమేపీ పేదల పాఠశాల లు గా మారిపోయింది. 

       కష్టం చేసుకునే ప్రజల పిల్లలు..  
ఇంటి దగ్గర కష్టపడుతూ స్కూల్ కి వచ్చి చదువుకునే పిల్లలు.. 

    ఏ మాత్రము చదువుకు సహకరించని తల్లిదండ్రులున్న పిల్లలు... ప్రభుత్వ పాఠశాలలకు దిక్కయ్యారు

       వాళ్లలో కూడా *తెలివైనవారిని* రెసిడెన్షియల్ పాఠశాలలు, నవోదయ పాఠశాలలు లాంటివి పరీక్షలు పెట్టి తీసుకెళ్లిపోయారు.

       ఇక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల మీద భారం వేసి నీవల్లే ప్రభుత్వ పాఠశాల నాశనమయ్యిందంటూ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ప్రజల మీద *దురభిప్రాయం* రుద్దింది.  

       *ఆకులు చిదిమేసి, కొమ్మలు నరికేసి, చెట్టు మొదలు కి నీరు పోసినట్టు..* 

       ఇన్ని సంవత్సరాల తర్వాత మేము ఇంగ్లీష్ మీడియం పెడుతున్నాం అని.. *తూతూమంత్రంగా* ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టాయి. 

   పెట్టినా.. అందుకు *తగ్గట్టు వనరులు* సమకూర్చ లేకపోయింది. 
‌ 
   ప్రైవేటు పాఠశాల పక్కన, ప్రభుత్వ పాఠశాల చిన్న పోయేలా ప్రభుత్వం తయారుచేసింది.  

  1.* సరిపడినంత మంది ఉపాధ్యాయులు ఇవ్వలేకపోవడం

*2.* విద్యార్థులకు తరగతి గదులు సరిపడా ఫర్నిచర్ లేకపోవడం.

  3.* ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్లు, ట్రాన్స్ఫర్లు సరైన సమయంలో చేసి, సరైన పద్ధతిలో పాఠశాలలను నడిపించలేక పోవటం

  4.* ప్రైవేటు విద్యార్థులు సొంతంగా సిలబస్ లు.రూపొందించుకున్న వారిని అదుపు చేయలేక పోవడం.

 5.* కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి, క్లాస్ రూమ్ సిలబస్ కి సంబంధం లేకపోవడం.. 
       ఉదాహరణకు *5వ తరగతి పూర్తి చేసి నవోదయ రాస్తున్న విద్యార్థికి ఐదవ తరగతి సిలబస్ లో ఉన్న ప్రశ్నలు కాకుండా ఇతరత్రా జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువ ఉండటం వల్ల వాటిని పాఠశాలలో బోధించే ఏవిధంగా సిలబస్ లేకపోవడం.* 
       ఇంటర్మీడియట్ రెండు సంవత్సరములు *MPC గ్రూప్ గవర్నమెంట్ కాలేజీలో చదివి లెక్కలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక్క లైను కూడా మిస్ అవ్వకుండా మొత్తం అవపోసణ చేసిన వాడికి ఐఐటీలో సీటు వస్తుందా?* ‌రాదు...  

       ఎందుకంటే *ఆ సిలబస్లో లేని అంశాలు, అంతకు మించిన అంశాలను ఆ ఎక్జామ్ లో ప్రశ్నించడం వలన...* 

       అంటే *ప్రభుత్వం ఆ అంశాలను ఎందుకు సిలబస్ లో పొందుపరచ లేకపోయింది. లేదా ఇంటర్మీడియట్ సిలబస్ కు మించకుండా ఐఐటీ ఎగ్జామ్ ని ఎందుకు నిర్వహించలేక పోతుంది?* 
       అంటే *గవర్నమెంట్ పాఠశాల పుస్తకాలు, గవర్నమెంట్ కాలేజీ చదువులు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కు సరిపోవు..* అనే భావాన్ని ప్రజల్లో బాగా నాటింది... 

       ఈ విధంగా ప్రభుత్వం తన విధానాలతో ప్రభుత్వ స్కూళ్ల విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ.. ఆ తప్పిదాన్ని ఉపాధ్యాయులు మీదికి నెట్టేస్తూ *ప్రజల్లో ఆ భావాన్ని గట్టిగా నాటింది.*

       *నిజంగా ఇప్పుడు ప్రాథమిక విద్య అభ్యసిస్తున్న రాష్ట్రంలో విద్యార్థులందరూ ప్రభుత్వ స్కూల్లో జాయిన్ అయితే వారి సంఖ్యకు తగ్గట్టు స్కూళ్లను ఏర్పాటు చేసి, ఉపాధ్యాయులను ప్రభుత్వం నియమించగలదా...?* 

       *ఆ సామర్ధ్యం ప్రభుత్వం దగ్గర ఉంటే ప్రభుత్వ స్కూళ్లు ఎందుకు బలోపేతం కావు ..?!*

       ఇక్కడ నేను చెప్ప వచ్చే *ముఖ్యమైన విషయం ఏంటంటే* ... 

       ఫలితాలు చూపిస్తూ మేము మీ కంటే మెరుగ్గా ఉన్నాం అని *విర్రవీగే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు*, వాటిని సమర్థించే *గొర్రె మంద లాంటి జనాలు* ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకోవాలి. 

       *నీళ్లు ఉన్నచోట ఎవరైనా పంట పండిస్తారు..*

       *ఎడారిలో పండించండి ...*

       మీ ప్రవేట్ స్కూల్ కి వచ్చిన ప్రతి పిల్లాడు ప్రతి రోజు స్కూల్ కి వస్తాడు. 

       వారిని స్కూల్ దాకా దింపే తల్లిదండ్రులు ఉంటారు.

       నువ్వు అడిగిన ప్రతి పుస్తకం కొంటాడు. 

       నువ్వు ఎన్ని గంటలు రుద్దుతున్నా వింటాడు. 

       వాళ్ల తల్లిదండ్రులు విద్యావంతులై ఉంటారు. 

       ఇంటి దగ్గర మాత్రం వారి కోసం సమయం కేటాయించగల గలవారై ఉంటారు. 

       ఆ పిల్లలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తారు. 

       *మరి నా ప్రభుత్వ స్కూల్ కి వచ్చిన పిల్లాడు ..*

       నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు, రోజువారి కూలీల పిల్లలు... 

       అడిగిన పుస్తకం కూడా లేని పరిస్థితి.. 

       ఇంటి పని అంతా చేసుకొని సమయానికి స్కూలు రాని పరిస్థితి... 

       పేదరికంలో ఉన్న వాళ్లు ఆరోగ్యం చెడిపోతే మధ్యలోనే నెలలపాటు పాఠశాల మాని వేసే పరిస్థితి.. 

       ఉదయాన్నే పనికిపోయే తల్లిదండ్రులు వాడు పాఠశాలకు వెళ్తున్నాడు లేదో కూడా పట్టించుకోని పరిస్థితి..  

       పౌష్టికాహారం లేక బక్కచిక్కిన పిల్లలు.. 

       ★ నువ్వు మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలను చేర్చుకోవు.

       *మేము చేర్చుకుంటాం...*

       ★ మీరు పుస్తకం లేకపోతే బడీకి రానివ్వరు..

       *మేము రానిస్తాం...*

       ★ మీరు పాఠశాలకు ఆలస్యమైతే ఒప్పుకోరు..

       *మాకు వాడు పాఠశాలకు ఎప్పుడు వచ్చినా అదే పదివేలు..*

       ★ మీరు మీ విద్యార్థులకు హోం వర్క్ చేయకపోతే వాళ్ల తల్లిదండ్రులను కూడా మందలిస్తారు.

       *మా పిల్లల తల్లిదండ్రులు 90 శాతం నిరక్షరాస్యులు..*

       ★ మీ పాఠశాలను శుభ్రం చేసే మనుషులు ఉంటారు.

       *మాకు మా విద్యార్థులు మరియు మేమే ఆ పని చేస్తాం.*

       ★ మీరు చదువులో వెనుకబడిన విద్యార్థులకు పాఠశాల నుండి తీసివేసి పంపించేస్తారు.

       ఎందుకంటే వాడు ఉంటే మీ పాఠశాల *పరువు తక్కువ* కాబట్టి.

       *మేము వెనుకబడిన విద్యార్థులకు పిలిచి మరీ పాఠశాలలో చేర్చుకుంటాం.*

       ★ మీ పాఠశాలలో క్రీడలు లాంటివి లేవు. అంతెందుకు గ్రౌండ్ లే లేవు.

       *మా పాఠశాలలో తప్పనిసరిగా క్రీడలు ఆడించవలసిందే...*

       ★ మీ పాఠశాలలో తెలివైన విద్యార్థులను మీరే దాచుకుంటారు. ఫీజు రాయితీలు అంటూ బయటికి పోనివ్వరు.

       *ఎందుకంటే వాడి పేరు చెప్పి ఇంకో వందమందిని ఆకర్షించాలిగా..*

       *మా పాఠశాలలో తెలివైనవారిని నవోదయ రెసిడెన్షియల్ స్కూల్స్ కి పంపించేస్తుంటాం...*

       ★ మీరు కొన్ని వందల పాఠశాలల బ్రాంచ్ లు కలిపి అది మీ యొక్క పాఠశాల రిజల్ట్ గా చెప్పుకుంటారు...

       *మాకు మా పాఠశాలలో వస్తేనే మా గొప్ప...*

       ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి... 

       *అవన్నీ మీకు కూడా తెలుసు...* 

       వ్యవస్థలో లోపాలు సరిచేయకుండా ప్రభుత్వ ఉపాధ్యాయుడిదే లోపం అని మాట్లాడుతున్న *గా.. అందరూ ఈ అన్ని విషయాలు గమనించండి.*

       అయినా *మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ తోపులు* కాలేదు.. 

       లక్షల మంది దగ్గర్నుంచి ఐఐటీ సీట్లంటూ *లక్షలు.. గుంజేస్తుంటే ఏ వందమందికో సీట్లు* వస్తున్నాయి... 

       *మరి మిగతా వాళ్ల సంగతేంటి..?*

       మా ప్రభుత్వ పాఠశాలలో పదికి పది పాయింట్లు వచ్చిన వారిని నీలాగ రాష్ట్రం అంతా కలిపి లెక్కేస్తే, టీవీల్లో ప్రకటనలు ఇస్తే *నువ్వు ఒక పక్కకు కూడా రావు..* అది *నీ లాంటి సౌకర్యాలు లేకుండా..* 

       ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి *కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్టు* ఉంది.

       ప్రైవేట్ పాఠశాలలు *గోదారి బ్రిడ్జి మీద కారులో పోతున్నట్టు* ఉంది.. 

       అన్ని తెలుసుకోకుండా ఎవడికి వాడు ఈ రంగంలో లేకుండా *ఒడ్డున కూర్చుని మామీద రాళ్లువేయడం* సరికాదు.

       దయచేసి *ప్రభుత్వ పెద్దలు* ఈ లోపాలను సరి చేయండి.

       *నిజమే.. అనిపిస్తే* ఈ నిజాలను ఎంత ఎక్కువ మందికి చేరవేస్తే(share) అంత మంచి చేసినవారు అవుతారు.

       ఆలస్యమెందుకు... చదివిన వెంటనే ఆ పని మొదలు పెట్టండి.

తెలంగాణ ప్రభుత్వానికి టెట్ అభ్యర్థి లేఖ

గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ. కె.చంద్రశేఖర్ గార్కి, విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ.సబితా ఇంద్రారెడ్డి గారికి టెట్ అభ్యర్థి రాస్తున్న లేఖ

విషయం : టెట్ పేపర్ -2లో సైన్స్ అభ్యర్థులకు జరుగుతున్న అన్యాయం గురించి వివరణ కోరుతూ...విన్నపం 

అయ్యా....

నా పేరు పి. గోపాల్ రావు. ఎంఏ.బీఎడ్ పూర్తి చేశాను. ప్రస్తుతం ఓ ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నాను. 
 
తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యావిధానంలో మార్పు వస్తుందని, నిరుద్యోగులకు త్వరగా ఉద్యోగాలు వస్తాయని భావించిన వారిలో నేనొకడిని. అయితే ఉపాధ్యాయ ఎంపిక కోసం ప్రభుత్వం ముందస్తుగా  నిర్వహిస్తున్న టెట్(టీచర్స్ ఎలిజబులిటీ టెస్ట్) పరీక్షపై నాకు కొన్ని అభ్యంతరాలున్నాయి. చాలా సందేహాలున్నాయి. దయచేసి వాటిని మీ దృష్టికి తీసుకువస్తే నా సందేహాలను నివృత్తి చేస్తారని, వీలైతే న్యాయం చేస్తారని భావించి ఈ లేఖ రాస్తున్నాను.  

• అసలు టెట్ పరీక్ష ఎందుకు ?

• ఏ ఉద్దేశంతో ప్రభుత్వం టెట్ నిర్వహిస్తున్నారు?

• ఉపాధ్యాయ శిక్షణ కోసం డీఈడీ, బీఈడీ లాంటి కోర్సులకు ఎంట్రెన్స్ లు రాసి సెలెక్ట్ అయి కోర్సు పూర్తి చేయడానికి మళ్లీ పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన వారిని ప్రత్యేకంగా పరీక్షించేదేముంది?

•   ట్రైనింగ్ చేసిన అభ్యర్థి ఆల్రెడీ ఎన్నో పరీక్షలు రాసి ఉత్తీర్ణుడైతే గానీ ఆ స్థాయికి రాడు.. అలాంటి అభ్యర్థులను మళ్లీ టెట్ లో మీరు కొత్తగా పరీక్షించాల్సిందేముంది?

• టెట్-2 (సైన్స్ అండ్ మ్యాథ్స్) పేపర్ వల్ల సైన్స్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతున్న విషయం మీకు తెలుసా ? ఎప్పుడైనా ఈ విషయం మీరు గమనించారా ?

• 150 మార్కులుండే టెట్ పేపర్ -2 లో తెలుగుకు 30 మార్కులు, ఇంగ్లీష్ కు 30 మార్కులు, ఛైల్డ్ సైకాలజీ(పెడగాజీ)కి 30 మార్కులు కేటాయించారు.బాగానే ఉంది. కాన సైన్స్ అభ్యర్థికి తను చదువుకున్న సైన్స్ లో 15 మార్కులు ఇచ్చి, అసలు సైన్స్ అభ్యర్థికి ఎందుకూ ఉపయోగపడని మ్యాథ్స్ కు 30 మార్కులు, ఫిజికల్ సైన్స్ కు 15 మార్కులు కేటాయించడం ఎంతవరకు కరెక్ట్ ? దీని వల్ల కేవలం మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అభ్యర్థులు మాత్రమే ఎక్కువ శాతం ఉత్తీర్ణులు కాగలుగుతున్నారు. బయోలాజికల్ సైన్స్ అభ్యర్థుల ఉత్తీర్ణత శాతం ఎందుకు తగ్గుతుందో మీరు ఆలోచించి ఉంటే ఈ విషయం మీదాకా వచ్చేది!

• సైన్స్ టీచరయ్యే అభ్యర్థికి మీరిచ్చేవి  15  మార్కులా? అంటే అతడి సబ్జెక్ట్ పై అవగాహన ఉండాల్సిన అవసరం లేదనా మీ ఉద్ధేశం ?

• స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్ టీచరయ్యే అవకాశం మాకున్నప్పుడు, బోధించేది సైన్స్ అయినప్పుడు మాకు మ్యాథ్స్ , ఫిజిక్స్ నేర్చుకోని ఏం చేయాలి ? భవిష్యత్తులో సైన్స్ అభ్యర్థిని వేరే రకంగా ఉపయోగించుకునే ఆలోచన ఉందా?

• టెట్-2 లో సైన్స్ పరీక్ష రాసి క్వాలిఫై అయి డీఎస్సీలో మంచి మార్కులతో భవిష్యత్తులో ఉద్యోగం సాధించే సైన్స్ అభ్యర్థికి మ్యాథ్స్ తో పనేముంది మాకు క్లారిటీ ఇవ్వండి? 

• సైన్స్ అభ్యర్థికి మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ చదవడం వల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయో చెప్పండి?

• సైన్స్ అభ్యర్థిలో మ్యాథ్స్ నైపుణ్యాలు ఉన్నాయా అని పరీక్షించడం ఎంత వరకు న్యాయం ?

• టెట్-2 పేపర్లో మీరు సైన్స్(జీవశాస్త్రం) అభ్యర్థిని దృష్టిలో పెట్టుకొనే మీరు మార్గదర్శకాలు తయారు చేశారా?

• మ్యాథ్స్ అంటే భయముండే ఇంటర్ లో బైపీసీ గ్రూప్ ఎంచుకున్నాం. డిగ్రీలో బీజెడ్సీ సైన్స్ చదివాం..బీఈడీలో సైన్స్ తీసుకున్నాం..పదవ తరగతి తర్వాత మాకు మ్యాథ్స్ పై అసలు పట్టే లేదు..అలాంటప్పుడు టెట్ లో సైన్స్ అభ్యర్థికి మ్యాథ్స్ ఎందుకు పెట్టినట్లు ?

• సోషల్ అభ్యర్థులకు టెట్ -2లో సోషల్ మెథడ్ కు 60 మార్కులు ఇచ్చారు. మ్యాథ్స్ అండ్ ఫిజికల్ సైన్స్ వారికి 45 మార్కులు ఇచ్చారు.మరి సైన్స్ అభ్యర్థులు మీ ప్రభుత్వానికి ఏం ద్రోహం చేశారని కేవలం 15 మార్కులే కేటాయించారు..దీనిపై వివరణ ఇవ్వండి?

• పైగా ఓపెన్ కేటగిరి అభ్యర్థులకు 60 శాతం మార్కులు వస్తేనే క్వాలిఫై అంటున్నారు. మీరు తయారు చేసిన పేపర్లలో, మీరు పొందుపరిచిన సబ్జెక్ట్ లతో సైన్స్ చదివిన ఒక ఓసీ అభ్యర్థి ఓపెన్ కేటగిరిలో క్వాలిఫై ఎలా అవుతాడు ? 150 మార్కులకు 90 మార్కులు ఎలా వస్తాయి? 

• టెట్ పరీక్షే శుద్ధ దండగ అనుకుంటే అందులో ఇలాంటి మార్గదర్శకాలేంటి ?

• టెట్ విధానాన్ని రూపొందించింది ఎవరో తెలియదు కానీ వారికి సబ్జెక్ట్స్ పై అవగాహన లేదని అర్థమవుతోంది. దయచేసి తెలంగాణ ప్రభుత్వంలోనైనా అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా.

• ఇప్పటికే సైన్స్ అభ్యర్థులకు న్యాయం చేయండి మహాప్రభో అని నల్గొండ జిల్లాలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.. కనీస అవగాహనతో ఆలోచిస్తే టెట్ లో సైన్స్ అభ్యర్థులకు జరుగుతున్న అన్యాయలను పరిశీలించి వారికి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. 

• వీలైతే పక్క రాష్ట్రంలో పెడుతున్న మాదిరిగా టెట్, డీఎస్సీ కలిపి పెట్టండి. దానికి మీరు ఏ పేరైనా పెట్టుకోండి!

• ఒక టీచర్ గా సెలెక్ట్ అవ్వడానికి ఇంత వ్యయప్రయాసలకోర్చి మేము చదువుకొంటుంటే మీరు చేస్తున్నదేమిటి ? మీ మార్గదర్శకాలను సవరించుకొనే హక్కు, అధికారాలు మీకు లేవా? అన్యాయం జరుగుతుందని తెలిసే నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడం ఎంతవరకు సమంజసం ?

• మీరు వేసే నోటిఫికేషన్ లో వేకెన్సీ ఉన్న పోస్టులనే నింపుతారు కదా. అలాంటప్పుడు టెట్ పరీక్ష పెట్టడం వల్ల మీకు శ్రమ, మాకు ఖర్చు దండగేననిపిస్తుంది. డైరెక్ట్ గా ఇంతకుముందున్నట్లు డీఎస్సీని నిర్వహిస్తే సరిపోతుంది కదా.

• చివరగా మీపై అభిమానంతో, గౌరవంతో అడుగుతున్నాం.టెట్ పరీక్షలో పేపర్ -2లో సైన్స్ అభ్యర్థులకు జరుగుతున్న అన్యాయాలపై కమిటీ వేసి న్యాయం జరిగేలా చూడండి. ఓసీలకు అర్హత మార్కుల శాతం తగ్గించండి. దీని కోసం కూడా ఉద్యమాలు చేయడం మా వల్ల కాదు...ఇప్పటికే చాలా జీవితాన్ని, విలువైన సమయాన్ని కోల్పోయాం..జీవితంలో స్థిరపడే దశలో ఉన్న మాకు ఈ అయోమయస్థితిని కట్టబెట్టిన మీరే న్యాయం చేయాలి.

ఇట్లు
టెట్ అభ్యర్థి
పి.గోపాల్ రావు
9494 273 373

తొలి ఏకా దశి అంటే ఏమిటి , ఎందుకు చేసుకుంటారు , దీని విశిష్టత ఏంటి ? సంపూర్ణ వివరణ!

హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది. తెలుగు సంవత్సరంలో అన్ని పండగలను వెంటపెట్టుకోచ్చే తొలి ఏకాదశి విశిష్టత ఏంటో తెలుసుకుందాం.

తొలి ఏకాదశి అంటే ఏమిటి

ఆషాడ శుద్ధ ఏకాదశిని “తొలి ఏకాద‌శి” అంటారు. సంవత్సరం మొత్తం మీద వచ్చే 24 ఏకాదశులు (ప్రతీ నెల కృష్ణ పక్షంలో ఒకటి , శుక్ల పక్షంలో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశులు వస్తాయి.) ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకుంటాయి. ఏకాదశి అంటే పదకొండు అని అర్థం. మనకు ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు , ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయించే అంతరేంద్రియం అయిన మనసు కలిపితే పదకొండు. ఈ పదకొండు ఏకోన్ముకంగా పనిచేసే సమయమే ఏకాదశి.

తొలి ఏకాదశి – విశిష్టత

ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా (ఆషాఢ శుద్ధ ఏకాదశిగా) జరుపుకుంటారు. దీనినే “శయన ఏకాదశి , ప్రధమ ఏకాదశి”, “హరివాసరం” అని కూడా అంటారు. ఈ రోజు నుంచీ శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధి యందు శేషపాన్పు పైన శయనిస్తాడు. కనుక దీన్ని “శయన ఏకాదశి”  అంటారు. నిజానికి ఒకరకంగా పరిశీలిస్తే , ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు , సూర్య చంద్రులు , గ్రహాలు పరస్పర సంబంధాన్నీ , వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈరోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు ( సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు , ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది). అంతేగాక చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని , కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని పురాణాలు చెబుతున్నాయి.

తొలి ఏకాదశి జరుపుకొను విధానం , నియమాలు

మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత , అశ్వమేధ యాగం చేసినంత , అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి. మహాసాధ్వీ సతీ సక్కుభాయి ఈ వ్రతాన్నే ఆచరించి మోక్ష సిద్ధి పొందటం జరిగింది. వ్రతంలోని ప్రధాన నియమాలు.

ఉపవాస ఫలితాలు:

ఈ వ్రతాన్ని ఆచరించదలచినవారు దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. 

అసత్యమాడరాదు. స్త్రీ సాంగత్యం పనికి రాదు. కాని పనులు , దుష్ట ఆలోచనలు చేయకూడదు. 

ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. 

అన్నదానం చేయడం చాలా మంచిది. 

ఏకాదశి వ్రతమాచరించేవారు ఇవి తినరాదు.

ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి , శుచిగా స్నానమాచరించి , శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు , కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి.

ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి , మాంసాహారం , పుచ్చకాయ , గుమ్మడి కాయ , చింతపండు , ఉసిరి , ఉలవలు , మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించారు. అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ , ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ , మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొన్నారని చెప్తుంటారు.

ఈరోజు నుండి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు *‘చాతుర్మాస్య వ్రతం’* అవలంబిస్తారు. శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది , ఈ చాతుర్మాస్య వ్రత నియమం. ఏకాదశినాడు ఉపవసించి , మర్నాడు పారణ చేసి , ప్రసాదం తీసుకొని వ్రతం ముగిస్తారు. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి , అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని , పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని , ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు. తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి , అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి , ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు. 

తొలి ఏకాదశి రోజున శేషసాయిని పూజిస్తే..

ప్ర‌తినెలా వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఈ మాసంలోనే బోనాలు , పశుపూజ , శకట ఆరాధనలు చేస్తారు.

ప్రాశస్త్యం

 ముఖ్యంగా ఆషాఢమాసం వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటి పూట భోంచేసి , శేషశాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం. ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి , రాత్రికి జాగారం చేసి , మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు.

 దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేస్తారు.

హాల్దర్ నాగ్

అయ్యా ఢిల్లీ రావడానికి నావద్ద డబ్బులు లేవు. దయచేసి బహుమతిని పోస్టులో పంపండి. *హాల్ధర్ నాగ్*  పేరు ముందు ఇప్పటి వరకు ఎవ్వరూ శ్రీ పెట్టి పిలువలేదు.
      *మూడు జతల బట్టలు,  ఊడ తెగిన రబ్బరు చెప్పులు, ఒక కాడలు లేని కండ్లజోడు, జీవితంలో 732 రూపాయలు జమ చేసుకున్న గ్రామీణ భారతీయుడు పద్మశ్రీ పురస్కారం కొరకు ఎంపిక కాబడ్డాడు.* 
     వీరే కోస్లీ భాష  సుప్రసిద్ధ కవి, ఒడిస్సా రాష్ట్రానికి చెందిన హాల్ధార్ నాగ్. చెప్పుకోదగ్గ విషయమేమంటే వీరు ఇప్పటి వరకు రచించిన కవితలు, 20 మహాకావ్యాలు అన్ని వీరి నాలుక పై ఉంటాయి. ఇప్పుడు వీరి రచనా సంకలనం *హల్ధర్ గ్రంథావలీ-2* సంబల్పూర్ విశ్వవిద్యాలయంలో పాఠ్యఅంశము.
       సాదా-సీదా కట్టుబొట్టు, తెల్లని ధోవతి-బనీను ధరించే నాగ్ గారు చెప్పులు లేకుండానే తిరుగుతారు. ఇలాంటి వజ్రాన్ని కేంద్ర ప్రభుత్వం వెతికి పట్టుకుంది. 
      ఒడియా భాష జానపద కవి గురించి తెలుసుకుంటే  ప్రేరణతో ఉబ్బి-తబ్బిబ్బు అవుతారు. గ్రామీణ *దళిత కుటుంబంలో* జన్మించిన హాల్ధర్ 10వ ఏట  తల్లి-దండ్రులను కోల్పోయాడు. 3వ తరగతిలోనే చదువు ఆగిపోయింది. అనాధగా బతుకుతూ డాబా హోటళ్లలో ఎంగిలి ప్లేట్లు కడిగి ఆకలి తీర్చుకునేవారు. తర్వాత ఒక స్కూల్ లో వంట మనిషి పని దొరికింది. కొన్ని సంవత్సరాల తర్వాత బ్యాంకు నుండి 1000 రూపాయలు అప్పు తీసుకొని కాపీలు-పెన్నులు-పెన్సిల్లు ఆమ్ముకోడానికి ఒక డబ్బా దుకాణం స్కూల్ ముందు పెట్టుకున్నారు. ఇది వారి ఆర్థిక స్థితి.
      వీరి సాహిత్య సేవల గురించి చెప్పుకుంటే 1995 కాలంలో స్థానిక ఒడియా భాష కోస్లీ లో
*రాం-శబరీ* పేరుతో కవిత్వాలు వ్రాసి-వ్రాసి ప్రజలకు వినిపించే వారు. భావయుక్త కవిత్వాలను ప్రజలు ఎంతో మెచ్చుకునే వారు. అలా ప్రసిద్ధి చెందిన హల్ధర్ నాగ్ గారు భారత రాష్ట్రపతి చేతుల మీదుగా *పద్మశ్రీ పురస్కారం* సాదా-సీదా వేషధారణలో అందుకున్నారు.
       వీరు చదివింది మూడవ తరగతే!
అయినా వీరి రచనల పై విశ్వవిద్యాలయంలో 5 గురు విద్యార్థులు PHD చేస్తున్నారు.
    మీరు పుస్తకాల్లో ప్రకృతిని వెతుకుతారు.
పద్మశ్రీ గారు ప్రకృతిని నుండి పుస్తకాలు వెతికారు  🙏👍🙏

హిందీ నుండి తెలుగు అనువాదం.....

తెలంగాణ సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్స్-1964 ప్రవర్తన నియమావళి.

ప్రతి ఉద్యోగి ఈ రూల్స్ కు లోబడి విధులు నిర్వహించాలి. వాటిలో కొన్ని....

రూల్-3A

👉🏿 ఏ ప్రభుత్వ ఉద్యోగి భారతదేశ సార్వభౌమత్వానికి సమగ్రతకు భంగం కలిగించే ఏ సంఘంలో సభ్యత్వం చేయరాదు.

రూల్-3B

👉🏿 ఏ ప్రభుత్వ ఉద్యోగి ఆ మర్యాదపూర్వకంగా ప్రవర్తించకూడదు.

రూల్-3C

👉🏿 ఏ పురుష ఉద్యోగి మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించరాదు.

రూల్-5

👉🏿 ఏ ప్రభుత్వ ఉద్యోగి భారతదేశ సార్వభౌమత్వానికి సమగ్రతకు భంగం కలిగించే ధర్నాలలో పాల్గొనకూడదు.

రూల్-6

👉🏿 ఏ ప్రభుత్వ ఉద్యోగి వారి కుటుంబ సభ్యులు ఎవరు నుండి బహుమతులు పొందరాదు.శంకుస్థాపనలు, రిబ్బన్ కటింగ్ వంటివి చేయరాదు.

రూల్-8

 *ఏ ప్రభుత్వ ఉద్యోగి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎలాంటి వ్యాపార లావాదేవీల్లో పాల్గొనకూడదు.* 

రూల్-12

👉🏿ఏ ప్రభుత్వ ఉద్యోగి తన ప్రభుత్వ విధులు మినహా మిగతా *ఏ ప్రైవేటు ఉద్యోగం ఇతర కార్యక్రమాల్లో పాల్గొనకూడదు.* 

రూల్-13

👉🏿ఏ ప్రభుత్వ ఉద్యోగి ముందస్తు అనుమతి లేకుండా సాంకేతిక, సాహిత్య, కళాత్మక ధోరణి లేని పుస్తకాలు ముద్రించరాదు.

రూల్-15

 *ఏ ప్రభుత్వ ఉద్యోగి పూర్తిగా గాని పాక్షికంగా గాని ఏ ప్రెస్ లో పనిచేయరాదు.* 

రూల్-16

👉🏿ముందస్తు అనుమతి లేకుండా రేడియో,టీవీలో పత్రికలలో ఎలాంటి ఆర్టికల్స్ గాని ప్రచురించకూడదు.

రూల్-17

 *ఏ ప్రభుత్వ ఉద్యోగి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు గాని చర్యలు ను గాని విమర్శించరాదు.* 

👉🏿అయితే కేవలము ప్రభుత్వ ఉద్యోగులే పాల్గొన్న ప్రవేట్ సమావేశాల్లో గాని సంఘ సమావేశాల్లో గాని ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై చర్చించవచ్చు.

రూల్-19

👉🏿ఏ ప్రభుత్వ ఉద్యోగి రాజకీయ పార్టీలో సభ్యత్వం ఉండకూడదు.మరియు ఏ *రాజకీయ పార్టీ తరఫున ప్రచారము చేయకూడదు.* 

రూల్-20

 *ప్రభుత్వ ఉద్యోగి తన చర్యల ద్వారా ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రకటనలు చేయరాదు.* 

రూల్-25

👉🏿ఏ ప్రభుత్వ ఉద్యోగి భార్య బ్రతికుండగా రెండో భార్యను చేసుకోరాదు.

రూల్-26

 *ఏ ప్రభుత్వ ఉద్యోగి మద్యం మత్తులో విధి నిర్వహణ చేయరాదు.* 
బహిరంగ మద్యo, మోతాదుకు మించిన మద్యం సేవించరాదు.

బ్యాంకు క్లర్కు కొలువు సాధిద్దాం!

ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 6 వేలకు పైగా క్లర్కు పోస్టుల భర్తీకి ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో 209, తెలంగాణలో 99 ఉద్యోగాల ఖాళీలు భర్తీకానున్నాయి. ఈ సంఖ్య మరింత పెరగొచ్ఛు నోటిఫికేషన్‌ విడుదల సమయంలో మొత్తం 11 బ్యాంకుల్లో నాలుగు బ్యాంకులు తమ ఖాళీల వివరాలను ఐబీపీఎస్‌కు తెలియజేయలేదు. మార్చి 31, 2023 వరకు ఖాళీల వివరాలను తెలిపే వీలుండటంతో ఆలోగా ఉండే పదవీ విరమణ.. తదితర కారణాలతో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.

బ్యాంకు క్లర్కు కొలువు సాధిద్దాం! వచ్చే ఏడాదిన్నరలో పది లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీచేసే ప్రక్రియను వెంటనే మొదలుపెట్టాల్సిందిగా ప్రధాని ఆదేశించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఈమధ్య విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. దానికి తగిన విధంగానే వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు ఖాళీల భర్తీకి సమాయత్తమవుతున్నాయి. స్టాఫ్‌సెలెక్షన్‌ కమిషన్‌ 70 వేల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. రైల్వే, ఇతర శాఖల్లోని ఖాళీలను కూడా భర్తీ చేసే ప్రక్రియ మొదలు పెడుతున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్లు త్వరలో రాబోతున్నాయి. ఐబీపీఎస్‌ ఇదివరకే ప్రకటించిన పరీక్షల క్యాలండర్‌ ప్రకారం త్వరలోనే పీవో, స్పెషలిస్ట్‌ ఆఫీసర్ల నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది. ఎస్‌బీఐ నుంచి కూడా పీవో, క్లర్క్‌ నోటిఫికేషన్లు ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశం ఉంది.

గత ప్రశ్నపత్రాలు గమనిస్తే..

గతంలో జరిగిన పరీక్షల ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ఏయే టాపిక్స్‌ నుంచి ఎన్నెన్ని ప్రశ్నలు వస్తున్నాయో...ఆ వెయిటేజి అర్థమవుతుంది. ఇంగ్లిష్‌ విభాగంలో గ్రామర్‌ ఆధార ప్రశ్నలు ఎక్కువ. ఉదాహరణకు జంబుల్డ్‌ సెంటెన్సెస్‌, ఎర్రర్‌ కరెక్షన్‌, ఫిల్లర్స్‌, రీ అరేంజ్‌మెంట్‌ ఆఫ్‌ వర్డ్‌/ సెంటెన్స్‌, క్లోజ్‌ టెస్ట్‌ లాంటివి. ఇవి సాధించాలంటే గ్రామర్‌పై అవగాహన అవసరం. అయితే పాఠశాల స్థాయిలోనే అభ్యర్థులంతా ఇంగ్లిష్‌ గ్రామర్‌ నేర్చుకుని ఉంటారు. కాబట్టి వారికి దానిపై అవగాహన తప్పనిసరిగా ఉంటుంది. అందువల్ల పరీక్షలో వచ్చే ప్రశ్నలను ప్రాక్టీస్‌ చేస్తూ సందేహమున్నప్పుడు సంబంధిత గ్రామర్‌ను చూసుకుంటే ఇంగ్లిష్‌ విభాగంలో ఎక్కువ ప్రశ్నలు సాధించవచ్ఛు అన్ని విభాగాల్లోని టాపిక్స్‌ని బాగా నేర్చుకుంటే ఆపై ప్రశ్నను వేగంగా సాధిచగలిగేలా వీలైనంత ప్రాక్టీస్‌ చేయాలి. సాధన చేస్తూ ఉంటేనే ప్రశ్నలను వేగంగా సాధించగలిగే మెలకువలు అర్థమవుతాయి.

బీఎస్‌ఐఆర్‌ పరీక్షలు.. ఒకటే సన్నద్ధత

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలైన బ్యాంకు, స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌, ఇన్సూరెన్స్‌, రైల్వే పరీక్షలు సబ్జెక్టుపరంగా, పరీక్ష విధాన పరంగా దాదాపు ఒకే విధంగా ఉంటాయి. పరీక్షలపరంగా ఉండే కొద్దిపాటి భేదాలను మినహాయిస్తే దాదాపు 70-80 శాతం ఒకేలా ఉంటాయి. కాబట్టి ఐబీపీఎస్‌ క్లర్క్‌ ప్రిపరేషన్‌ త్వరలో రాబోయే ఇతర బ్యాంకు పరీక్షలు, కేంద్ర ప్రభుత్వ పరీక్షలకు ఉపయుక్తం. బ్యాంకు పరీక్షలన్నీ ఒకేవిధంగా ఉంటాయి. ఈ ప్రిపరేషన్‌ వాటికీ సరిపోతుంది. ఇతర పరీక్షలకు వాటికి అదనంగా ఉండే సబ్జెక్టులపరంగా సన్నద్ధతలో మార్పులు చేసుకుంటే చాలు. అయితే ముందుగా ఐబీపీఎస్‌ క్లర్క్‌ పరీక్షకు పూర్తి స్థాయిలో సిద్ధమవ్వాలి.

ప్రిలిమినరీ పరీక్షను సెప్టెంబరు మొదటి వారంలో నిర్వహిస్తారు. మెయిన్స్‌ పరీక్ష అక్టోబరులో ఉంటుంది. అంటే ప్రిలిమ్స్‌ పరీక్షకు కనీసం 60 రోజులు, మెయిన్స్‌కు 90 రోజుల సమయం ఉంటుంది. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షలు రెండింటిలోనూ ఉండే మొత్తం నాలుగు విభాగాల్లో.. మూడు రెండింటిలోనూ ఉమ్మడిగా ఉన్నాయి. కాబట్టి ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ రెండింటికీ కలిపే సన్నద్ధమవ్వాలి. ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌ విభాగాలను హెచ్చు స్థాయిలోనే అధ్యయనం చేయాలి. మొదటిసారి రాసేవారు ముందుగా ఆప్టిట్యూడ్‌, రీజనింగుల్లోని టాపిక్స్‌ అన్నింటినీ బాగా నేర్చుకోవాలి. ఒక్కోదానిలో 10-15 టాపిక్స్‌ ఉంటాయి. ప్రతిరోజూ రెండింటిలో ఒక టాపిక్‌ను పూర్తిగా నేర్చుకోవాలి. పరీక్షలో ఎక్కువ ప్రశ్నలు వచ్చే అంశాలను ముందుగా పూర్తిచేసి ఆ తర్వాత ఒక ప్రశ్న వచ్చే టాపిక్స్‌ నేర్చుకోవాలి. ఉదాహరణకు ఆప్టిట్యూడ్‌లో సింప్లిఫికేషన్స్‌ నుంచి కనీసం 10, నంబర్‌ సిరీస్‌ నుంచి 5, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌ నుంచి 5, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ నుంచి 5 ప్రశ్నలు తప్పనిసరిగా ఉంటాయి. వీటిని ముందుగా పూర్తిచేసుకుని ఆపై ఒక్కో ప్రశ్న వచ్చే అరిథ్‌మెటిక్‌ టాపిక్స్‌ నేర్చుకోవాలి. అదేవిధంగా రీజనింగ్‌లో సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌, పజిల్స్‌ టాపిక్స్‌ నుంచి 15-20 ప్రశ్నలు వస్తాయి. వీటిలోనే బ్లడ్‌ రిలేషన్స్‌తో కలిపి కొన్నిసార్లు ప్రశ్నలు వస్తాయి. ముందుగా వాటిని.. ఆ తర్వాత ఇతర టాపిక్స్‌ను నేర్చుకోవాలి.

మోడల్‌ టెస్ట్‌లు తప్పనిసరి

వీలైతే ప్రారంభం నుంచీ లేకపోతే టాపిక్స్‌ అన్నీ నేర్చుకున్న తర్వాత రోజూ తప్పనిసరిగా పరీక్షలోని పూర్తిస్థాయి మాదిరి ప్రశ్నపత్రం రాయాలి. ఆపై దాన్ని విశ్లేషిస్తే ప్రిపరేషన్‌ ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. మెరుగుపరుచుకోవాల్సిన టాపిక్స్‌/ విభాగాలను గుర్తించి తదనుగుణంగా సిద్ధమయ్యే అవకాశం కలుగుతుంది. నిర్ణీత సమయంలో ఎన్ని ప్రశ్నలను సాధించగలుగుతున్నారో కూడా అర్థమై..ఆ సంఖ్యను పెంచేలా ప్రాక్టీస్‌లో మార్పులు చేసుకోవచ్చు.

కరెంట్‌ అఫైర్స్‌పై నోట్సు

ప్రారంభం నుంచే రోజూ వార్తాపత్రికను చదువుతూ అంతర్జాతీయ, జాతీయ, ఆర్థిక, బ్యాంకింగ్‌, సాంకేతికత మొదలైనవాటి ముఖ్య విషయాలను నోట్‌ చేసుకోవాలి. ప్రతివారం వాటన్నింటినీ తిరిగి చూసుకుంటే జనరల్‌ అవేర్‌నెస్‌ కోసం ప్రత్యేకంగా ప్రిపేర్‌ అయ్యే అవసరం ఉండదు. అయితే బ్యాంకింగ్‌ టర్మినాలజీ విషయాలు బాగా తెలుసుకోవాలి. దీంతోపాటే మెయిన్స్‌ పరీక్షలో రీజనింగ్‌ విభాగంలో ఉండే కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌లో కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కూడా నేర్చుకోవాలి. పరీక్షలో దాని నుంచి ఎటువంటి ప్రశ్నలు వస్తున్నాయో గమనించి తదనుగుణంగా వాటిని నేర్చుకోవాలి. ఇవన్నీ కవరయ్యే విధంగా రోజూ తగిన సమయం కేటాయించుకుని చదవాలి. ఎంత సమయం చదివాం అని కాకుండా ఎంతమేర నేర్చుకున్నామనేది ముఖ్యం. ఐబీపీఎస్‌ క్లర్క్‌ పరీక్ష ప్రిపరేషన్‌ రాబోయే ఇతర పరీక్షలకూ ఉపయోగపడుతుంది.

నోటిఫికేషన్‌ వివరాలు

పోస్టుల సంఖ్య : 6035

విద్యార్హతలు : ఏదైనా డిగ్రీ, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వయసు

(జనరల్‌ అభ్యర్థులకు) : 20-28 సంవత్సరాలు (01.07.22 నాటికి)

దరఖాస్తు ఫీజు : రూ. 175 (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్‌సర్వీస్‌మెన్‌) రూ.850 (ఇతరులు)

దరఖాస్తులకు చివరి తేది : 21.07.2022

పరీక్ష తేది : సెప్టెంబరు 2022-ప్రిలిమ్స్‌ అక్టోబరు 2022 - మెయిన్స్‌

వెబ్‌సైట్‌ : www.ibps.in

SSY: సుక‌న్య స‌మృద్ధి యోజ‌న ఖాతా గురించి సందేహాలా?.. సమాధానాలివిగో..!

సుకన్య స‌మృద్ధి యోజ‌న‌.. ఆడ‌పిల్ల‌ల భ‌విష్యత్‌ కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కం ఇది. 10 ఏళ్లలోపు వ‌య‌సున్న ఆడ‌పిల్ల‌ల త‌ల్లిదండ్రులు ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డులు పెట్ట‌డం ద్వారా త‌మ ఆడ‌పిల్ల‌ల‌ భవిష్య‌త్‌ (ఉన్న‌త చ‌దువులు, వివాహం) కోసం డ‌బ్బు స‌మ‌కూర్చుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం వార్షికంగా 7.60 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. కాబ‌ట్టి కాంపౌండింగ్ ప్ర‌భావంతో రిస్క్ లేకుండా ద్ర‌వ్యోల్బ‌ణానికి మించి రాబ‌డి పొంద‌వ‌చ్చు. ఈ ప‌థ‌కం గురించి పెట్టుబ‌డిదారుల‌కు త‌ర‌చూ వ‌చ్చే కొన్ని సందేహాల‌కు స‌మాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్ర‌శ్న‌..1: బాలిక పేరుపై ఎస్ఎస్‌వై ఖాతాను ఎవ‌రు తెర‌వచ్చు?
స‌మాధానం: 10 ఏళ్ల లోపు వ‌య‌సు గ‌ల బాలిక పేరుపై ఆమె త‌ల్లి లేదా తండ్రి లేదా చ‌ట్ట‌ప‌ర‌మైన గార్డియ‌న్ సుక‌న్య సమృద్ధి యోజ‌న ఖాతాను తెర‌వ‌చ్చు.

ప్ర‌శ్న‌..2: ఎస్ఎస్‌వై ఖాతాను ఎక్క‌డ తెరవాలి?

స‌మాధానం: మీ ద‌గ్గ‌ర‌లోని పోస్టాఫీసులో గానీ.. అధీకృత బ్యాంకులో గానీ తెర‌వ‌చ్చు.

ప్ర‌శ్న‌..3: భార‌త్‌లో ఎక్క‌డైనా ఎస్ఎస్‌వై ఖాతాను తెర‌వ‌చ్చా?

స‌మాధానం: తెర‌వ‌చ్చు. సుక‌న్య స‌మృద్ధి యోజ‌న కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కం. అందువ‌ల్ల ఇది భార‌త్‌లోని ప్ర‌తీ రాష్ట్రం, కేంద్ర‌పాలిత ప్రాంతంలో అందుబాటులో ఉంది. 

ప్ర‌శ్న‌..4: ఎస్ఎస్‌వై ఖాతా కాల‌ప‌రిమితి ఎంత‌?
స‌మాధానం: ఎస్ఎస్‌వై ఖాతాకు 21 సంవ‌త్స‌రాల మెచ్యూరిటీ పిరియ‌డ్ ఉంటుంది. అంటే, పాప‌కు 8 ఏళ్ల వ‌య‌సున్న‌ప్పుడు ఖాతాను ప్రారంభిస్తే 29 ఏళ్ల‌కు ఖాతా మెచ్యూర్ అవుతుంది.

ప్ర‌శ్న‌..5: ఎస్ఎస్‌వై ఖాతాలో మెచ్యూరిటీ వ‌ర‌కు పెట్టుబ‌డులు పెట్టాలా?

స‌మాధానం: ఎస్ఎస్‌వై ఖాతాకు 21 సంవ‌త్స‌రాల మెచ్యూరిటీ పిరియ‌డ్ ఉన్న‌ప్ప‌టికీ, ఖాతా తెరిచిన నాటి నుంచి 15 సంవ‌త్స‌రాల పాటు పెట్టుబ‌డులు పెడితే స‌రిపోతుంది.

ప్ర‌శ్న‌..6: మెచ్యూరిటీకి ముందే ఎస్ఎస్‌వై నుంచి డ‌బ్బు విత్‌డ్రా చేసుకోవ‌చ్చా?

స‌మాధానం: లేదు. కొన్ని ప్ర‌త్యేక సంద‌ర్భాల‌లో త‌ప్ప.. పాప‌కు 18 సంవ‌త్స‌రాలు నిండ‌క ముందు, ముంద‌స్తు విత్‌డ్రాల‌ను అనుమితించ‌రు. బాలికకు 18 సంవ‌త్స‌రాలు నిండిన త‌ర్వాత ఉన్న‌త‌ విద్య‌, వివాహం వంటి కారణాల‌తో 50 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.

ప్ర‌శ్న‌..7: ఏయే సంద‌ర్భాల్లో ఖాతాను పూర్తిగా మూసివేయ‌వ‌చ్చు?

స‌మాధానం: ఈ కింది సంద‌ర్భాల్లో ఖాతా తెరిచిన 5 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఖాతాను పూర్తిగా మూసివేయ‌వ‌చ్చు
* ఏదైనా అనుకోని కారణాల చేత ఖాతాదారు మరణిస్తే వెంటనే మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించి ఖాతాను మూసివేయవచ్చు.
* ఖాతాదారు ప్రాణాంత‌క వ్యాధుల బారిన ప‌డిన‌ప్పుడు
* ఖాతా నిర్వ‌హిస్తున్న గార్డియ‌న్ మ‌ర‌ణించిన‌ప్పుడు
పై సంద‌ర్భాల్లో ఖాతాను మూసివేయాల‌నుకుంటే.. ద‌ర‌ఖాస్తు ఫారంతో పాటు, పాస్‌బుక్‌, ఇత‌ర కావాల్సిన అన్ని ప‌త్రాల‌ను ఖాతా ఉన్న పోస్టాఫీసు/బ్యాంకులో ఇవ్వాల్సి ఉంటుంది.  

    ఖాతాదారులకి 18 సంవత్సరాల వయస్సు పూర్తై, ఆమెకు వివాహం జరిగినట్లయితే ముందస్తు మూసివేతకు అవకాశం ఉంటుంది. వివాహానికి ఒక నెల ముందు లేదా మూడు నెలల తర్వాత ఖాతాలోని మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. 21 ఏళ్లు వచ్చాక ఖాతాను పూర్తిగా ముగించవచ్చు.

ప్ర‌శ్న‌..8: ఒక వ్య‌క్తి ఎన్ని ఎస్ఎస్‌వై ఖాతాలు తెర‌వ‌చ్చు?
స‌మాధానం: ఒక ఆడ‌పిల్ల పేరుపై ఒక ఖాతాను తెరిచే వీలుంది. కాబ‌ట్టి, ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు ఉన్న‌వారు వారి ఇద్ద‌రి పిల్ల‌ల పేరుపై ఒక్కో ఖాతా చొప్పున రెండు ఖాతాలు తెర‌వ‌చ్చు. ఒక‌వేళ మొద‌టి సంతానం ఆడ‌పిల్ల అయివుండి రెండోసారి ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు (క‌వ‌ల‌లుగా) జ‌న్మించిన‌ట్ల‌యితే అప్పుడు మూడో ఖాతాను కూడా తెర‌వ‌చ్చు.

ప్ర‌శ్న‌..9: పాప పేరుతో ఎస్ఎస్‌వై ఖాతా ప్రారంభించిన వ్య‌క్తి మ‌ర‌ణిస్తే?
స‌మాధానం: ఒక‌వేళ పాప పేరుతో ఎస్ఎస్‌వైలో పెట్టుబ‌డి పెడ‌తున్న వ్య‌క్తి (త‌ల్లి లేదా తండ్రి లేదా చ‌ట్ట‌ప‌ర‌మైన గార్డియ‌న్) మ‌ర‌ణిస్తే ఖాతాను మూసివేయ‌వ‌చ్చు. లేదా పాప కుటుంబంలోని వేరొక వ్య‌క్తి ఖాతా భాద్య‌త తీసుకోవ‌చ్చు. లేదా ఖాతాలో అప్ప‌టి వ‌ర‌కు జ‌మైన మొత్తంతో పాప‌కు 21 ఏళ్లు వ‌చ్చే వ‌ర‌కు ఖాతా కొనసాగించ‌వ‌చ్చు. ఖాతాను కొన‌సాగించినంత‌కాలం ఖాతాలో జ‌మైన మొత్తంపై వ‌డ్డీ వ‌స్తుంది.

ప్ర‌శ్న‌..10: సాధార‌ణ బ్యాంకు ఖాతాను ఎస్ఎస్‌వై ఖాతాగా మార్చుకోవ‌చ్చా?
స‌మాధానం: లేదు. ప్ర‌స్తుతం ఈ ఫీచ‌ర్ అందుబాటులో లేదు. సుక‌న్య స‌మృద్ధి యోజ‌న అనేది ఆడ‌పిల్ల‌ల ఆర్థిక స్థితిని పెంపొందించే ల‌క్ష్యంతో ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక ప‌థ‌కం. అందువ‌ల్ల దీన్ని ప్ర‌త్యేకంగా తెర‌వాల్సి ఉంటుంది.

ప్ర‌శ్న‌..11: ఖాతాను ఒక‌ చోటి నుంచి మ‌రొక చోటుకు బ‌దిలీ చేసుకోవ‌చ్చా?
స‌మాధానం: ఒక ప్రాంతం నుంచి మ‌రొక ప్రాంతానికి బ‌దిలీ చేసుకోవ‌చ్చు. పోస్టాఫీసులో ఒక బ్రాంచి నుంచి మ‌రొక బ్రాంచికి గానీ, పోస్టాఫీసు నుంచి అధీకృత బ్యాంకుకు గానీ, బ్యాంకు నుంచి పోస్టాఫీసుకు గానీ, ఒక‌ బ్యాంకు నుంచి మ‌రొక బ్యాంకుకు గానీ బ‌దిలీ చేసుకోవ‌చ్చు. బాలిక‌లు వారి చ‌దువుల కోసం లేదా ఇత‌ర కార‌ణాల వ‌ల్ల ఒక చోటి నుంచి మ‌రొక చోటికి మారే అవ‌కాశం ఉంది కాబ‌ట్టి ఈ ఫీచ‌ర్‌ను అందుబాటులో ఉంచారు.

ప్ర‌శ్న‌..12: ఖాతా పెట్టుబ‌డులు పెట్టేందుకు క‌నిష్ఠ‌, గ‌రిష్ఠ ప‌రిమితులు ఎంత‌?
స‌మాధానం: ఎస్ఎస్‌వై ఖాతాలో ఖాతా నిర్వ‌హ‌ణ కోసం ఏడాదికి కనీసం రూ.250 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గ‌రిష్ఠంగా రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు డిపాజిట్ చేయ‌వ‌చ్చు.

ప్ర‌శ్న‌..13: పెట్టుబ‌డి మొత్తాన్ని ఒకేసారి డిపాజిట్ చేయాలా?
స‌మాధానం: ఎస్ఎస్‌వై ఖాతాలో ఒక ఏడాదికి అనుమితించిన గరిష్ఠ ప‌రిమితుల‌కు లోబ‌డి ఎన్ని సార్లైనా డ‌బ్బు డిపాజిట్ చేయ‌వ‌చ్చు.

ప్ర‌శ్న‌..14: గ‌రిష్ఠ ప‌రిమితి మించి డిపాజిట్ చేయ‌వ‌చ్చా?ఒక‌వేళ చేస్తే ఆ మొత్తంపై వ‌డ్డీ వ‌ర్తిస్తుందా?
స‌మాధానం: ఎస్ఎస్‌వై ఖాతాలో అనుమితించిన గ‌రిష్ఠ ప‌రిమితిని మించి డిపాజిట్ చేసినా.. అద‌న‌పు మొత్తంపై వ‌డ్డీ వ‌ర్తించ‌దు. అలాగే, అద‌న‌పు మొత్తంపై ప‌న్ను ప్ర‌యోజ‌నాలు వ‌ర్తించ‌వు.

ప్ర‌శ్న‌..15: క‌నీస మొత్తాన్ని డిపాజిట్ చేయ‌క‌పోతే..?
స‌మాధానం: సుక‌న్య స‌మృద్ధి యోజ‌న ఖాతాలో ఏడాదికి క‌నీసం రూ.250 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయడంలో విఫ‌లం అయితే రూ.50 జ‌రిమానా విధిస్తారు. 

ప్ర‌శ్న‌..16: ఎస్ఎస్‌వై ఖాతా నుంచి రుణం తీసుకోవ‌చ్చా?
స‌మాధానం: లేదు. సుక‌న్య స‌మృద్ధి యోజ‌న ఖాతాలో జ‌మ చేసిన మొత్తం నుంచి రుణం తీసుకునే వెసులుబాటు లేదు. 

ప్ర‌శ్న‌..17: ఎన్నారైలు ఎస్ఎస్‌వై ఖాతాను తెర‌వ‌చ్చా?
స‌మాధానం: ఎన్నారైలు భార‌త‌దేశం వెలుప‌ల నివ‌సిస్తున్నంత వ‌ర‌కు ఎస్ఎస్‌వై ఖాతా తెరిచేందుకు వీలుండ‌దు. ఒక‌సారి భార‌త‌దేశం వ‌చ్చి స్థిర‌ప‌డిన త‌ర్వాత ఖాతాను తెర‌వ‌చ్చు. 

ప్ర‌శ్న‌..18: ఇప్ప‌టికే ఎస్ఎస్‌వై ఖాతా ఉన్న‌వారు విదేశాలకు వెళ్లిన త‌ర్వాత ఖాతా కొన‌సాగించ‌వచ్చా?
స‌మాధానం: బాలిక‌కు భార‌తీయ పౌర‌స‌త్వం ఉన్నంత‌వ‌ర‌కు ఖాతాను కొన‌సాగించ‌వ‌చ్చు. ఎన్నారైగా మారితే ఖాతాను ర‌ద్దు చేస్తారు.

ప్ర‌శ్న‌..19: ఎస్ఎస్‌వై ఖాతాపై ఎంత వ‌రకు ప‌న్ను ప్ర‌యోజ‌నం ల‌భిస్తుంది?
స‌మాధానం: సుక‌న్య స‌మృద్ధి యోజ‌న ఖాతాలో డిపాజిట్ చేసిన మొత్తంపై సెక్ష‌న్ 80సి కింద ఏడాదికి రూ. 1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను ప్ర‌యోజ‌నం పొంద‌వ‌చ్చు. 

ప్ర‌శ్న‌..20: సుక‌న్య స‌మృద్ధి ఖాతా నుంచి వ‌చ్చే వ‌డ్డీపై ప‌న్ను వ‌ర్తిస్తుందా?
స‌మాధానం: ఎస్ఎస్‌వై ఖాతాపై 'ఈఈఈ' ప‌న్ను ప్ర‌యోజ‌నం ల‌భిస్తుంది. ఖాతాలో పెట్టుబ‌డి పెట్టిన మొత్తం, ఆర్జించిన వ‌డ్డీ, మెచ్యూరిటీ మొత్తంపై ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నం ల‌భిస్తుంది.

తల్లిదండ్రులు.......

‘‘ఏమండీ, రాత్రి మామయ్యగారు ఫోన్‌ చేశారు- మీరెప్పుడొస్తారని. 

మీరేమో నా సెల్‌ నంబరు ఇచ్చారు. వాళ్ళు నాకే చేస్తున్నారు. మీ నంబరివ్వచ్చు కదా’’ 

హాల్లో కూర్చుని పేపర్‌ చదువుతున్న మాధవ దగ్గరకు కాఫీ తీసుకుని వస్తూ అంది రజని.

ఆమె దగ్గర నుండి కప్పు అందుకుని మళ్ళీ పేపర్‌లో తల దూర్చిన భర్తతో ‘‘ఏంటండీ, ఏం మాట్లాడరు... ఏమాలోచించారు, 

వాళ్ళ విషయం గురించి. ఇలా మీరేమీ మాట్లాడకుండా ఉంటే వాళ్ళు రోజూ ఫోన్‌ చేస్తూనే ఉంటారు. 

వూరికే నాన్చక ఏదో ఒకటి తేల్చండి’’ అంది.

ఇవాళ ఆదివారం. ఈ విషయం గురించి ఏదో ఒకటి తేల్చేయాలని బాగా ప్రిపేరయి ఉంది తను. 

పేపర్‌లో నుంచి తల పైకెత్తి ‘‘ఇందులో తేల్చేదేముందోయ్‌, అమ్మా నాన్నా ‘ఇక ఆ పల్లెటూళ్ళొ ఒంటరిగా ఉండలేం, ఇక్కడకు వచ్చేస్తా’మంటున్నారు, 

అంతేకదా! పెద్ద వయసయ్యాక కొడుకు దగ్గరే కదా ఉండాలి. 

వాళ్ళేదో అడగకూడని విషయమేదో అడిగినట్లు మాట్లాడతావేంటీ’’ అన్నాడు.

అతని మాటలు విని అక్కడే సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్న పిల్లలు ‘

‘ఏంటీ, తాతయ్య, నానమ్మ ఇక్కడకే వచ్చేస్తున్నారా, భలేభలే! 

తాతయ్య కథలు చాలా బాగా చెపుతాడు. 

నానమ్మయితే మాకు స్నానం చేయిస్తుంది, అన్నం తినిపిస్తుంది. 

ఇంక రోజూ మేం తాతయ్యా నానమ్మ దగ్గరే పడుకుంటాం. తొందరగా రమ్మనండి డాడీ’’ అంటూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

పిల్లలు కూడా అలా అనటంతో కోపం వచ్చింది రజనికి. ‘‘చాల్లే నోరు ముయ్యండి, వాళ్ళ దగ్గరైతే మీ వేషాలన్నీ సాగుతాయని మీ సంతోషం’’ అని భర్త వైపు తిరిగి, 

‘‘ఏంటండీ రానిచ్చేది, ఇక్కడ మనమెలా ఉంటున్నాం, మీ అమ్మా నాన్నా ఎలా ఉంటారు?

 ఆ పల్లెటూరి మాటలూ, చేతలూ ఎలా ఉంటాయో మీకు తెలుసుగా! మనింటికి పెద్దపెద్ద వాళ్ళందరూ వస్తారు. 

వాళ్ళు వీళ్ళని చూస్తే ఏమనుకుంటారు. పోయినసారి మనింట్లో ఫంక్షన్‌కి వచ్చినప్పుడు మీ అమ్మని చూసి మీ మేనేజరుగారి భార్య ఏమందో తెలుసా... ‘

ఈవిడ మీ అత్తగారా! నేను మీ వంటమనిషనుకున్నాను’ అంది. 

నాకు తల కొట్టేసినట్లయింది. కావాలంటే ఆ పల్లెటూళ్ళొనే ఉండమనండి. 

కావాల్సినంతమంది పనివాళ్ళని పెడదాం. లేదూ ఇక్కడికే వస్తామంటే ఏ ఓల్డేజ్‌హోమ్‌లోనైనా చేర్పించండి. 

డబ్బెంతైనా కట్టగల స్తోమత మనకుందిగా. అంతేకానీ, ఇక్కడకు మాత్రం తీసుకొస్తానని అనకండి’’ అంది.

ఆమె మాటలు పూర్తి అయ్యీ కాకముందే ‘‘ఇక ఆపుతావా నీ గోల. 

ఏంటీ, మాట్లాడితే మా అమ్మానాన్నలను పల్లెటూరివాళ్ళంటావు. అలాగైతే నేనూ పల్లెటూరివాణ్ణేగా,

 నువ్వు మాత్రం పల్లెటూరిదానివి కాదా? కాకపోతే సిటీలో మీ బాబాయి ఉండటంతో నువ్వూ మీ అన్నా అక్కడ చదువు వెలగబెట్టారు. 

మీ అమ్మానాన్నా పల్లెటూరివాళ్ళు కాదా? మన పెళ్ళప్పుడు వాళ్ళుమాత్రం ఎలా ఉన్నారు? 

మీ అన్నయ్యకు ఉద్యోగమొచ్చి పెళ్ళయ్యాక వాళ్ళని తనతో తీసుకెళ్ళటంతో కొంచెం సిటీలైఫ్‌ వాళ్ళకి అలవాటైంది.

 నేనే ఇన్ని రోజులూ అశ్రద్ధ చేశాను. మావాళ్ళని కూడా అప్పుడే తెచ్చుంటే బాగానే ఉండేది. మా అమ్మేదో మొహమాటానికి ‘ఇప్పుడే మీ దగ్గరకెందుకులేరా! రేపు చేసుకోగలిగే ఓపిక లేనిరోజున ఎలాగూ మీ దగ్గరికే రావాలిగా’ అన్నదని, ‘

ఔను అత్తయ్యగారూ, మీరెప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావచ్చు- తొందరేముందీ! పైగా ఇక్కడ ఇంత మంచి వాతావరణంలో ఉండే మీరు, ఆ సిటీలో ఇరుకు అద్దె ఇళ్ళలో ఉండలేరు. 

మీ అబ్బాయి ఇల్లు కట్టాలనే ఆలోచనలో ఉన్నారు కూడా! మన సొంతిల్లయితే ఏ సమస్య రాదు అంటూ వాళ్ళను నువ్వే రానీకుండా అడ్డుపుల్ల వేశావు. 

ఇప్పుడు వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో ఉండి వస్తామంటుంటే ఇప్పుడు కూడా వద్దంటున్నావు. 

ఇంత పెద్ద ఇంట్లో వాళ్ళు ఒక గదిలో ఉంటే నీకేమైనా అడ్డమా! 

అన్నిటికీ పనివాళ్ళు ఉన్నారు. నువ్వేదో వాళ్ళకి బండచాకిరి చేయాలన్నట్లు మాట్లాడుతున్నావు. 

పైగా ఓల్డేజ్‌హోమ్‌లో చేర్చమని ఉచిత సలహాలు ఇస్తున్నావా? నేను వాళ్ళ కన్నకొడుకును. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నా తల్లిదండ్రులు నా దగ్గరే ఉండాలి, ఉంటారు కూడా అంతే. 

రేపు ముసలిదానివయ్యాక నువ్వు ఉందువుగానీలే ఓల్డేజ్‌హోమ్‌లో’’ అంటూ లేచి వెళ్ళి షర్ట్‌ వేసుకుని బయటికెళ్ళిపోయాడు కోపంగా.

భర్త తన మాట కాదనటంతో ఏం చేయాలో అర్థంకాలేదామెకి. 

ఇక ఏ విధంగా చెప్పినా అతన్ని మార్చటం కుదరదని తేలిపోయింది. 

పైగా పిల్లలు కూడా తండ్రినే సపోర్ట్‌ చేయటంతో తన మాటనెలా నెగ్గించుకోవాలో తోచలేదు. 

అత్తగారూ, మామగారూ మంచివాళ్ళే కానీ, కలిసుంటే తప్పక తేడాలొస్తాయనీ తగవులౌతాయనీ భయం. 

తన క్లోజ్‌ఫ్రెండ్‌ సుభద్ర అలా జరిగే, గొడవలు తీవ్రమై ఆత్మహత్య చేసుకుంది. దాంతో ఆ భయమింకా బలపడింది. 

చివరికి పల్లెటూరివాళ్ళని ఏదో వంక చెప్పి వాళ్ళను రాకుండా చేద్దామన్నా కుదరలేదు.

పైగా భర్తకి కూడా అమ్మానాన్నలంటే ఒకింత ప్రేమ ఎక్కువే. 

కొడుకు ఇల్లు కట్టేటప్పుడూ ఇతరత్రా అవసరాలపుడూ అతను అడగకుండానే డబ్బులూ బంగారం అంతా ఇచ్చేశారు. 

అప్పుడప్పుడూ వచ్చి నాల్రోజులుండి వెళ్ళేవాళ్ళు. ఇక ఇప్పుడు పూర్తిగా వచ్చేయాలని నిర్ణయించుకున్నారు. 

ఆలోచించుకుంటూనే వంట ప్రయత్నంలో పడింది. మధ్యాహ్నం భోజనాల దగ్గర కానీ రాత్రికి కానీ ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు. 

తెల్లారిపొద్దున లేచి తయారవుతున్న భర్తను ‘ఎక్కడికి’ అని అడుగుదామనిపించి కూడా అహం అడ్డొచ్చి ‘ఆయనే చెపుతార్లే’ అనుకుని కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలిపి తెచ్చి ఇచ్చింది.

కాఫీ అందుకుని ‘‘రజనీ, నేను వీరాపురం వెళ్తున్నాను. పొలం కౌలు, ఇంటి గురించీ మాట్లాడి అన్నీ సర్దుకుని అమ్మానాన్నలను తీసుకుని సాయంత్రానికల్లా వస్తాను’’ అంటూ, ఆమె సమాధానం చెప్పేలోపునే కారు దగ్గరకెళ్ళిపోయాడు.

ఆమెకు అతన్ని ఆపలేకపోయానని ఉక్రోషం ఎక్కువై దుఃఖంగా మారింది. 

కాసేపటికి తన బాధనెవరితోనైనా పంచుకోవాలనిపించింది. 

వెంటనే సెల్‌ తీసుకుని అన్నకు ఫోన్‌ చేసింది. ఆమె అన్న వినోద్‌ నాలుగైదు సిటీలలో జాబ్‌ చేసి, చివరికి ఢిల్లీలో స్థిరపడ్డాడు. 

వెళ్ళి సంవత్సరమైంది. పెద్ద ఇంజినీర్‌గా బాగా సంపాదిస్తున్నాడు. తమని రమ్మని చాలాసార్లు ఫోన్‌ చేశాడు కానీ వెళ్ళటానికి కుదరలేదు. 

అమ్మానాన్నలను చూడటానికైనా ఈ సమ్మర్‌లో వెళ్ళాలని అనుకుంటోంది. ఫోన్‌ రింగ్‌ మొత్తం అయిపోయింది- వినోద్‌ ఫోన్‌ తీయలేదు. 

అమ్మావాళ్ళకి చేద్దామంటే వాళ్ళకి ఫోన్‌ లేదు. అన్నయ్య ఫోన్‌లోనుండే మాట్లాడతారు. ‘ఒక ఫోన్‌ తీసుకోవచ్చు కదమ్మా’ అంటే, ‘అదంతా మాకు తెలియదమ్మా. ఇక్కడ అంతా హిందీ కదా... అన్నయ్య ఉన్నాడుగా అంటుంది.’

ఇంతలో ఫోన్‌ మోగింది. చూస్తే అన్నయ్యే! ఫోనెత్తగానే ‘‘రజనీ, నేను వేరేచోట మీటింగ్‌లో ఉన్నారా. 

సాయంత్రం నేనే ఫోన్‌ చేస్తాను. ఉంటాను’’ అంటూ హడావుడిగా పెట్టేశాడు. 

‘అయ్యో, అన్నయ్యతో మాట్లాడటానికి కూడా కుదరలేదే’ అని నిట్టూరుస్తూ పిల్లల్ని స్కూలుకి తయారుచేయటానికి లేచింది.

సాయంత్రమయింది. పిల్లలు స్కూలు నుంచి వచ్చాక, వాళ్ళకి స్నాక్స్‌ పెట్టి, పాలు ఇచ్చి, టీవీ దగ్గర కూర్చుంది. 

రాత్రి ఎనిమిది గంటలైంది. మాధవవాళ్ళు వచ్చేసరికి ఎదురెళ్ళి అత్తగారి చేతిలోని బ్యాగు తీసుకుని ‘‘బాగున్నారా అత్తయ్యగారూ, ఆరోగ్యం బాగుందా మామయ్యగారూ’’ అంది రజని- తన మనసులోని భావం ముఖంలో కనపడనీయకుండా.

పిల్లలు సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చి ‘‘తాతయ్యా, నానమ్మా’’ అంటూ వాళ్ళని వాటేసుకున్నారు.

అమ్మా నాన్నా వచ్చినపుడు భార్య ‘ఏ మూడ్‌లో, ఎలా ఉంటుందో’ అని భయపడుతున్న మాధవ తేలికగా వూపిరి పీల్చుకున్నాడు. స్నానం చేసి వస్తానని బెడ్‌రూమ్‌లోకి వెళ్ళాడు.

అత్తమామలకు వాళ్ళ రూమ్‌ చూపించి బాత్‌రూమ్‌లో గీజర్‌ ఆన్‌ చేసింది. ‘‘అత్తయ్యగారూ, మీరూ మామయ్యగారూ స్నానం చేసి రండి. ఈలోపు నేను భోజనాలు రెడీ చెస్తాను’’ అంది.

‘‘అలాగేనమ్మా. మేము వస్తాములే, నువ్వెళ్ళి పనిచూసుకో’’ అంది మాధవ తల్లి సీతమ్మ.

అందరూ మాట్లాడుకుంటూ భోంచేసి, పడుకునేసరికి పదకొండయింది.

తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో అందరూ మంచి నిద్రలో ఉన్నారు. కాలింగ్‌బెల్‌ అదే పనిగా మోగుతోంది.

 ‘ఈ టైములో ఎవరై ఉంటారబ్బా’ అనుకుంటూ నిద్రకళ్ళతో వచ్చి తలుపు తీసింది.

ఎదురుగా ఉన్న తల్లిదండ్రులను చూడగానే, ఆమె నిద్రమత్తంతా ఎగిరిపోయింది. 

ఆమె వెనుకే వచ్చిన మాధవ ఆశ్చర్యపోయినా ‘‘బాగున్నారా మామయ్యగారూ, అత్తయ్యగారూ’’ అంటూ వారిని పలకరించి, ‘‘ముందు లోపలికి రండి, చలిగా ఉంది’’ అని, ‘‘ఏంటలాగే నిలబడిపోయావు రజనీ, ముందు త్వరగా వెళ్ళి మీ అమ్మకీ నాన్నగారికీ కాఫీ కలిపి తీసుకురా త్వరగా’’ అన్నాడు.

‘‘రా అమ్మా, రండి నాన్నా’’ అంటూ వాళ్ళ దగ్గర బ్యాగులు తీసుకుని పక్కనపెట్టి, తలుపులు మూసి కిచెన్‌లోకి వెళ్ళింది. 

పెందలాడే లేచే అలవాటున్న మాధవ తల్లిదండ్రులు కూడా కాలింగ్‌బెల్‌ మోతకి లేచి హాల్లోకి వచ్చారు.

అందరి పలకరింపులయ్యేసరికి రజని అందరికీ కాఫీ తెచ్చి ఇచ్చింది.

‘వీళ్ళేంటి ఇంత సడెన్‌గా వచ్చారు. మా అమ్మా నాన్నా విషయం గురించి ఏమైనా మాట్లాడటానికి రజనీనే ఫోన్‌చేసి పిలిపించి ఉంటుందా?’- 

అని ఒక నిమిషం సందేహపడ్డాడు మాధవ. 

కానీ ఆమె ముఖం చూస్తే ఆమెకు కూడా వాళ్ళ రాక గురించి తెలియదని అర్థమైంది. 

మౌనంగా కాఫీ తాగుతున్న అత్తమామలను గమనించాడు. కొంచెం తేడాగా కనిపించారతనికి.

ఇదివరకున్న సంతోషం, కళా, కాంతి వాళ్ళ ముఖాల్లో కనిపించటంలేదు. అతనికన్నా ముందుగానే, తల్లిదండ్రులను చూసిన మరునిమిషంలోనే వాళ్ళ ముఖాల్లోని తేడాని గమనించేసింది రజని. 
ఎంతైనా కూతురు గదా!

‘‘వదినగారూ, అంత దూరంనుండి మీ ఇద్దరే వచ్చారా!’’ అని ఆశ్చర్యంగా అడిగింది సీతమ్మ.

‘‘లేదొదినగారూ, మాతో వినోద్‌ వచ్చాడు. వాడికి బెంగళూరులో ఏవో మీటింగులు ఉన్నాయట. వెళ్తున్నానన్నాడు. 

‘మేమూ వస్తాంరా, అమ్మాయి దగ్గరికి’ అంటే తీసుకొచ్చాడు. మమ్మల్ని ఆటో ఎక్కించి, వాడు ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాడు’’ అంది.

‘‘అన్నయ్య వచ్చాడా... అయితే ఇక్కడకి రాడటనా?’’ కోపంగా అంది రజని.

‘‘లేదమ్మా, ఎల్లుండి వస్తాడు. ఆరోజు రాత్రికి మళ్ళీ వెళ్ళిపోతాం ముగ్గురమూ’’ అంది రజని తల్లి సావిత్రమ్మ.

‘‘అదేంటమ్మా, అంత దూరం నుండి వచ్చి ఒక్క పదిరోజులైనా ఉండకుండా ఎలా వెళ్తారు? మళ్ళీ మీరెప్పుడో వస్తారు. అదేం కుదరదు, అన్నయ్యను రానీ, నేనడుగుతాను’’ అంది.

‘‘వద్దమ్మా, అడగొద్దు. అన్నయ్య తోడు లేకుండా మేం ఒక్కళ్ళమూ మళ్ళీ అంత దూరం వెళ్ళలేంగా... అందుకని వెళతాంలే’’ అంటూ కళ్ళు తుడుచుకుంటున్న తల్లిని చూసి, ఏదో జరిగిందని అర్థమైంది రజనీకి.

మాధవ, పిల్లలు వెళ్ళిపోయాక తల్లితో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంది.

అందరూ వెళ్ళిపోయాక తల్లి గదిలోకి వెళ్ళింది. అక్కడే అత్తమామలు కూడా ఉండేసరికి, కాసేపు మాట్లాడి వచ్చేసింది.

ఇక మధ్యాహ్నం భోజనాలప్పుడూ తరవాత కూడా వాళ్ళ నలుగురూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇలా రాత్రి వరకూ కుదరలేదు.

రాత్రి భోజనాలయిన తరవాత మాధవ, పిల్లలు- అత్తమామల గదిలోకెళ్ళారు. అప్పుడు తల్లిదండ్రుల గదిలోకెళ్ళింది.

తల్లి ఒక్కతే ఉంది. ‘‘నాన్న ఏరమ్మా?’’ అంది.

‘‘మీ అత్తయ్యగారి గదిలోకెళ్ళారమ్మా. అబ్బాయీ పిల్లలూ కూడా అక్కడే ఉన్నారుగా- మాట్లాడుతున్నారు.’’

సరే, నాన్న లేకపోయినా ఫరవాలేదులే అనుకుని ‘‘అమ్మా, నువ్వూ నాన్నా అలా ఉన్నారేంటి? 

ఉదయం నుండీ ఈ విషయం అడగాలని ఎంత తపనపడ్డా మాట్లాడటానికి కుదరలేదు. ఏం జరిగిందమ్మా, చెప్పవా’’ అంది.

కూతురలా అడిగేసరికి ఆ తల్లికి దుఃఖం ఆగలేదు. గుండెలవిసేలా రోదిస్తున్న తల్లిని ఎలా ఓదార్చాలో తెలియలేదు రజనీకి. తన కళ్ళవెంట నీళ్ళొచ్చేశాయి.

కొంతసేపటికి ‘‘ఏం చెప్పను తల్లీ, మీ వదిన చాలా మారిపోయింది ఢిల్లీ వెళ్ళాక. 

ఇప్పుడు, ఇన్నాళ్ళకి- మీ వదినకి మేమూ మా మాటలూ చేతలూ నచ్చటం లేదు. 

ఇంటికి పెద్దపెద్ద ఆఫీసర్లూ కలెక్టర్లూ వస్తారట. పార్టీలు జరుగుతాయట. 

వాళ్ళల్లో మేముంటే బాగోదట. ఏం చెప్పిందో, ఏం చేసిందో వాడిని కూడా మార్చేసింది.

 ఆరునెలలక్రితం మమ్మల్ని ఓల్డేజ్‌హోమ్‌లో చేర్పించారు. 
అప్పటి నుండి అక్కడే ఉంటున్నాం. నిన్ను చూడాలని ఉందని ఎప్పటినుంచో అడుగుతుంటే, 

ఇప్పుడు వాడు పనిమీద ఇటు వస్తూ మమ్మల్ని తీసుకొచ్చాడు. రేపు వెళ్ళేటపుడు ఢిల్లీలో దిగగానే మమ్మల్ని హోమ్‌లో వదిలేసి, 

వాడు ఇంటికి వెళ్ళిపోతాడు. ఏ జన్మలో ఏ పాపం చేశామోనమ్మా, దేవుడు మా నుదుటన ఇలా రాశాడు. 

చూడమ్మా రజనీ, ఎంతో ఆశతో బిడ్డల్ని కనీ, 
మరెంతో ప్రేమతో వాళ్ళని పెంచీ పెద్దచేసి, చదివించి, 
వాళ్ళు మంచి స్థితిలో ఉంటే చూసి ఆనందిస్తారు. 
పెళ్ళిచేసి వాళ్ళ పిల్లా పాపలతో ఆడుకుంటూ, 
కొడుకు దగ్గరే కన్ను మూయాలని కోరుకుంటారు ఏ తల్లిదండ్రులయినా. 

కానీ, కొడుక్కి పెళ్ళిచేసి, కొడుకుని కోడలి చేతికప్పగిస్తే వాడు భార్య చేతిలో కీలుబొమ్మగా మారి, 

తమను నిరాదరిస్తే ఆ తల్లిదండ్రులు పడే బాధా వేదనా ఎలా ఉంటుందో అనుభవించేవారికే తెలుస్తుంది. 

వాళ్ళ దుఃఖాన్నెవరూ తీర్చలేరు.

 ‘మీరు మాకు వద్దు, మా దగ్గర ఉండద్దు, మా ఇంటికి రావద్దు’ అంటే మేమే కాదు, ఈ వయసులో ఉన్న ఏ తల్లిదండ్రులయినా ఎలా తట్టుకోగలరు’’ 

అంటుంటే దుఃఖంతో ఆమె గొంతు పూడుకుపోయింది.

 ‘‘మీ అన్నలాగా డబ్బున్నవాళ్ళు వృద్ధాశ్రమాలలో పడేసి పోతున్నారు. 

డబ్బులేని వాళ్ళు ముసలివాళ్ళని వాళ్ళ ఖర్మానికి రోడ్లమీద వదిలేసి పోతున్నారు. 

పని చేసుకోగలిగే శక్తి ఉన్నవాళ్ళు ఎలాగోలా పనిచేసుకుని బతుకీడుస్తున్నారు. 

పని చేయగలిగే శక్తి లేనివాళ్ళు పనిచేయలేక, 
తిండిలేక, 
అడుక్కోవటానికి ముఖం చెల్లక, బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. 
ఇలా జరగటానికి కారణమేంటో తెలుసా తల్లీ! 

కొంతమంది, కొంతమందేంటి... చాలామంది కోడళ్ళు ‘అత్తమామలు కూడా తమ తల్లిదండ్రుల లాంటివారే కదా’ అని అనుకోకపోవటమే. 

అందుకే, ఇప్పుడు వృద్ధాశ్రమాలకి ఆదరణ ఎక్కువైంది. 

అక్కడ మేం బతికున్నాం అంటే, ఉన్నాం అంతే! 

మా మనసులెంత కుమిలిపోతున్నాయో నీ అన్నావదినలకు అక్కరలేదు. 

మాకు ఈ శిక్ష ఎందుకుపడిందో తెలీదు కానీ, 
మేమనుభవిస్తున్న ఈ వ్యధ ఇంకెవరికీ రాకూడదమ్మా’’ అంటూ, 

మళ్ళీ దుఃఖం ఉప్పెనలాగా ముంచుకురాగా కూతుర్ని కౌగిలించుకుని భోరుమంది ఆ తల్లి. 

తల్లి మాటలకు రజనీకి చెంపమీద ఛెళ్ళున చరిచినట్లనిపించింది అంత బాధలోనూ.

‘‘వూరుకోమ్మా, వూరుకో... అన్నయ్యిలా చేయడమేమిటి? వాడొచ్చాక నేను మాట్లాడతాను’’ అంది ఏడుస్తూ.

తల్లి బాధతో ఆమె హృదయం కోతకు గురైంది. 

దుఃఖం నుండి తేరుకున్న సావిత్రమ్మ, ‘‘మీ అత్తయ్యగారు వాళ్ళు రాత్రేనటగా వచ్చింది. 

వాడి పెంపకం విషయంలో మేమేదైనా పొరపాటు చేశామేమోగానీ, నీ విషయంలో మాకు చాలా తృప్తిగా ఉంది. 

నీలాంటి మంచి కోడలు దొరికిందని వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. మీరైనా ఆనందంగా ఉండండి, అది చాలు’’ అంది.

తల్లి మాటలకు గిల్టీగా ఫీలయింది రజని. 

ఇంకానయం, తను అన్నతోగానీ, తల్లితోగానీ మాట్లాడకపోవటమే మంచిదయిందనుకుంది. 

అంతలో మాధవ పిలవటంతో, ‘‘సరే, పడుకోండమ్మా, పొద్దుపోయింది’’ అంటూ వెళ్ళిపోయింది.

మూడోరోజు ఉదయం వినోద్‌ వచ్చాడు. అతను రాగానే తల్లిదండ్రుల ముఖంలో కాంతి తగ్గటం గమనించింది. 

అన్నతో మాట్లాడాలన్నా అందరూ అతని చుట్టూ ఉన్నారు. సాయంత్రం వరకూ అలాగే జరిగిపోయింది.

సాయంత్రం అందరూ టీ తాగటం అయ్యాక, వినోద్‌- తల్లితో ‘‘అమ్మా, ఇక బయలుదేరుదాం. ఎనిమిది గంటలకు ట్రైన్‌ ఉంది’’ అన్నాడు.

అందరూ ఉన్నా అక్కడ ఒక క్షణం నిశ్శబ్దం ఆవరించింది.

అంతలో మాధవ గొంతు సవరించుకుని ‘‘చూడు వినోద్‌, ఇకనుండి 

అత్తయ్యగారూ మామయ్యగారూ మా ఇంట్లో, మా దగ్గరే ఉంటారు’’ అన్నాడు.

అతని మాటకు వినోద్‌, రజనీ, అత్తమామలూ విస్తుపోయి చూశారు. అది వాళ్ళకి వూహించని పరిణామం.

‘‘అదికాదు బావా!’’ అంటూ ఏదో చెప్పబోయాడు వినోద్‌.

‘‘ఇంకేం చెప్పకు, నీవక్కడకు తీసుకెళ్ళినా, హోమ్‌లోనే కదా వాళ్ళుండేది. 

ఇక్కడుంటే కూతురి దగ్గరున్నామన్న సంతోషమైనా ఉంటుంది వాళ్ళకి. 

ఇంటికి పెద్దదిక్కు ఎంత అవసరమో నీకు తెలీదు వినోద్‌. 

అమ్మానాన్నలంటే మనమెప్పటికీ తీర్చుకోలేని తీరని రుణం. 

పెద్దవారితో కలిసి ఉండాలి, 
వాళ్ళకి సంతోషాన్ని కలిగించాలి. 
అలా ఉంటేనే ఆ ఇంట్లో శాంతి, సుఖం, సంతోషం ఉంటాయి. 

ఇలాంటి అభిప్రాయం మనమే మన పిల్లలకి కలిగించాలి. 

ఇప్పుడు నువ్వు మీ అమ్మానాన్నలని చేసినట్లే, రేపు నీ కొడుకులు నిన్ను చేయరా! 

దూరంగా ఉంచితే పెద్దవాళ్ళు పడే బాధ నీకప్పుడే అర్థంకాదులే. 

నేనేమీ కోపంగా చెప్పటం లేదు వినోద్‌. వాళ్ళిక్కడుంటే వాళ్ళకీ మనశ్శాంతిగా ఉంటుంది. 

మాకూ ఇంకో అమ్మానాన్నలకి సేవ చేసుకునే భాగ్యం కలుగుతుంది. 

మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఇక నువ్వేం ఆలోచించక బయల్దేరు’’ అన్నాడు.

వినోద్‌ తల దించుకుని వెళ్ళిపోయాడు.

మాధవ వైపు చూడటానికి ముఖం చెల్లలేదు రజనీకి. 

అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. 

గదిలోకి వెళ్ళటంతోనే మాధవ పాదాలమీద వాలిపోయింది రజని. 

‘‘ఏయ్‌ ఏంటిదీ, లే, లే...’’ అంటున్న అతనితో-

‘‘ఇన్నాళ్ళూ మీతో కలిసి కాపురంచేసి కూడా మీ మనసు అర్థంచేసుకోలేకపోయానండీ. 

అత్తయ్యా వాళ్ళవిషయంలో ఎంతో కఠినంగా మాట్లాడాను. 

నన్ను క్షమించండి. 

మీరెంతో పెద్ద మనసుతో మా అమ్మానాన్నలకు ఆశ్రయం ఇచ్చారు. 

మీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను’’ అంది ఏడుస్తూ.

‘‘పిచ్చి రజనీ, నాకు మా అమ్మానాన్నా, మీ అమ్మానాన్నా వేరుకాదు. 

ఆరోజు మీ అమ్మ నీతో చెప్పినపుడే మీ నాన్నగారు మాకు చెప్పారు. 

అప్పుడే అమ్మానాన్నా నేనూ ఇలా నిర్ణయించుకున్నాం. 

నిన్ను సర్‌ప్రైజ్‌ చేద్దామని నీకు చెప్పలేదు. 

ఏదో చిరాకులో మాట్లాడతావుగానీ నీ మనసెలాంటిదో నాకు తెలీదా’’ అన్నాడు.

అతనికి తనపైగల నమ్మకానికి మరోసారి గిల్టీగా ఫీలైంది. 

హాల్లోకొచ్చిన రజనీకి అత్తమామలు దేవతల్లాగా కనిపించారు. 

వెళ్ళి వాళ్ళ పాదాలకి దణ్ణం పెట్టుకుంది. తరవాత తల్లికీ తండ్రికీ కూడా.

‘‘ఇదేంటమ్మా, ఇప్పుడెందుకూ...’’ అని అడిగిన వాళ్ళకు, 

ఇవాళ పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలని ‘ఈటీవీ శుభమస్తు’లో చెప్పారండీ’’ అంది.

‘మా కోడలెంత బంగారం’ అని అత్తమామలూ, ‘కూతురెంత పద్ధతికలదో’ అని తల్లిదండ్రులూ మురిసిపోతుంటే, 

గదిలోనుండి అది చూసిన మాధవ- రజని తెలివికి నవ్వుకున్నాడు..

@@@@@@@@@@@@@@@
 
ఇప్పుడు మనం ఏదయితే చేస్తామో అదే చివరకి మనకి జరుగుతోంది..

దయచేసి అర్థం చేసుకోగలరు.

మన ఉమ్మడి కుటుంబాలను మనం కాపాడుకుందాం..

మన పిల్లలకు ఆరోగ్యకరమైన మంచి భవిష్యత్తునిదాం....!!

🙏🙏ఓపికగా చదివి నందుకు ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు....🙏🙏

ప్రభుత్వ ఉద్యోగుల సెలవుల నిభందనలు ఇలా




ఇతర దేశాలకు వెళ్లినవారికి సెలవు మంజూరు సందర్భంగా ప్రిఫిక్స్, సఫిక్స్ అనుమతించరాదనే ప్రభుత్వ ఉత్తర్వులే లేవు. కేవలం అజ్ఞానంతోనే అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేవారిలో పలువురు డీఈఓలు సైతం ఉండడం మరీ దారుణం. ఎంఈఓలు, హైస్కూల్ హెడ్ మాస్టర్ లకు అవసరమైన సందర్భాలలో రూల్స్పై సూచనలిస్తూ గైడ్చే యాల్సిన డీఈఓలే తప్పుడు ఉత్తర్వులు జారీ చేస్తే ఎలా? అయ్యా, ఆఫీసర్లూ! ఒక్కసారి టీఎస్ఎల్ఆర్-12 చదవండి. ఆ రూల్ తొమ్మిది లైన్లు మాత్రమే ఉంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అర్థ వేతన సెలవులను (హెచ్పీఎల్), ఆర్జిత సెలవులను (ఈఎల్), అసాధారణ జీత నష్టపు సెలవులను (ఈఓఎల్ఎల్పీ) ఆకస్మికేతర సెలవులను (ఓసీఎల్) రెండు కారణాలతో మంజూరు చేస్తారు. అందులో మొదటిది వ్యక్తిగత అవసరాల కోసం కాగా, రెండవది మెడికల్ అవసరాల కోసం. ఆకస్మికేతర సెలవులకు ప్రిఫిక్స్, సఫిక్స్ నిబంధన వర్తిస్తుంది. ఉపాధ్యాయులు పని చేసేది వెకేషన్ డిపార్టుమెంటు కాబట్టి, వేసవి సెలవులను కలుపుకొని 180 రోజులు మించకుండా లీవ్ పెట్టిన ఉపాధ్యాయులకు విధిగా లీవ్ మంజూరు చేయాలి. ఈ మేరకు తెలంగాణ స్టేట్ లీవ్ రూల్స్- 1933(టీఎస్ఎల్ఆర్)లోని రూల్-12 చాలా స్పష్టంగా ఉంది. విద్యాశాఖలో పనిచేస్తున్న కొంతమంది అధికారులు ఈ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. టీచర్ల పిల్లలు చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, జర్మనీ తదితర దేశాలకు యేటా పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. తమ పిల్లలను చూసి రావడానికి మెజారిటీ టీచర్లు వేసవి సెలవులను కలుపుకొని, సమ్మర్కి ముందో, తర్వాతో తరచుగా విదేశాలకు వెళ్తున్నారు. విద్యా శాఖ కమిషనర్ వద్ద ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతే విదేశాలకు వెళ్లి, నిర్దేశించిన గడువులోగా స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఇలా వేసవి సెలవులను కలుపుకొని విదేశాలకు వెళ్లి, తిరిగి వచ్చిన టీచర్లకు సెలవు మంజూరులో కొంతమంది విద్యాశాఖాధికారులు చుక్కలు చూపిస్తున్నారు. ప్రిఫిక్స్, సఫిక్స్ అనుమతించాలి వేసవి సెలవులు కలుపుకొని 180 రోజులకు మించకుండా సెలవు పెట్టిన టీచర్లకు టీఎస్ఎల్ఆర్-12 ప్రకారం వేసవి సెలవులను విధిగా ప్రిఫిక్స్, సఫిక్స్ అనుమతించి మిగతా పీరియడ్కి మాత్రమే సెలవు మంజూరు చేయాలి. ఈ వెసులుబాటు లభించాలంటే, సదరు టీచర్లు విద్యా సంవత్సరం ముగింపు రోజు కానీ, పాఠశాలలు పునఃప్రారంభం
రోజు కానీ విధులకు హాజరైతే సరిపోతుంది. సమ్మర్ హాలిడేస్ లోనే విదేశాలకు వెళ్లి, హాలిడేస్ పూర్తి కాకముందే స్వదేశానికి తిరిగి వచ్చి, రీ ఓపెనింగ్ నాడు పాఠశాలకు హాజరయ్యే టీచర్లకు లీవ్ మంజూరే అవసరం లేదు. ఇలాంటి టీచర్లు విద్యాశాఖ కమిషనర్ నుంచి జస్ట్ పర్మిషన్ తీసుకుంటే చాలు. ఈ ఏడాది లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్
23 కాగా, రీ ఓపెనింగ్ డే జూన్ 13. ఏప్రిల్ 23 లేదా జూన్ 13 నాడు స్కూలుకి హాజరైన టీచర్లు, వేసవి సెలవులలో ఇండియాలో ఉన్నారా? లేక విదేశాలకు వెళ్లారా? అనే విషయంతో సంబంధం లేకుండా ప్రిఫిక్స్, సఫిక్స్ప ర్మిట్ చేయాలి. కానీ, కొందరు అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ టీచర్లను తీవ్ర ఇబ్బంది పెడుతున్నారు. వేసవి సెలవులకు కూడా లీవ్ మంజూరు చేస్తామని అంటున్నారు. ఆ మేరకు దరఖాస్తు పెట్టుకోవాలని, లేదా
వేతనంలో కోత విధిస్తామని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. కారణమేంటని అడిగితే, 'సదరు టీచర్ వేసవి సెలవులలో ఇండియాలోనే లేరు. విదేశాలకు వెళ్లి వచ్చినవారికి వేసవి సెలవులను ప్రిఫిక్స్, సఫిక్స్ ఎలా అనుమతిస్తాం? శాలరీ ఎలా చెల్లిస్తాం' అని అడ్డగోలు వాదనకు దిగుతున్నారు. ఇతర దేశాలకు వెళ్లినవారికి సెలవు మంజూరు సందర్భంగా ప్రిఫిక్స్, సఫిక్స్ అనుమతించరాదనే ప్రభుత్వ ఉత్తర్వులే లేవు. కేవలం అజ్ఞానంతోనే
అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేవారిలో పలువురు డీఈఓలు సైతం ఉండడం మరీ దారుణం. ఎంఈఓలు, హైస్కూల్ హెడ్మాస్టర్లకు అవసరమైన సందర్భాలలో రూల్స్పై సూచనలిస్తూ గైడ్ చేయాల్సిన డీఈఓలే తప్పుడు ఉత్తర్వులు జారీ చేస్తే ఎలా? అయ్యా, ఆఫీసర్లూ! ఒక్కసారి టీఎస్ఎల్ఎర్-12 చదవండి. ఆ రూల్ తొమ్మిది లైన్లు మాత్రమే ఉంది. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి నిబంధనల ప్రకారం వేసవి సెలవులను ప్రిఫిక్స్, సఫిక్స్ అనుమతించకుండా నిరాకరించే అధికారులపై ముందుగా రాష్ట్ర విద్యా శాఖ ఉన్నతాధికారులతో పాటు మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సైతం బాధిత టీచర్లు ఫిర్యాదు చేయాలి. దీంతో పాటు ఆర్టీఐ ద్వారా సెలవు మంజూరు అధికారికి ఏ ఉత్తర్వుల ప్రాతిపదికగా వేసవి సెలవులను ప్రిఫిక్స్, సఫిక్స్ చేయడం లేదో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని లెటర్ పెట్టి సమాచారాన్ని లిఖితపూర్వకంగా తీసుకోవాలి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రతిని కూడా ఇవ్వాలని కోరాలి. బాధితులలో మహిళా టీచర్లు ఉన్న పక్షంలో రాష్ట్ర మహిళా కమిషన్లో కూడా ఫిర్యాదు చేయాలి. ఈ ఫిర్యాదులు చేయడానికి ఒక్క పైసా ఖర్చు కాదు. అప్పటికీ న్యాయం జరగకపోతే హైకోర్టుకి వెళ్లడానికి సైతం వెనకాడొద్దు. ఎవరో ఒకరు తెగించి పూనుకోకపోతే, నిబంధనలు విస్మరించి, ఇష్టారాజ్యంగా వ్యవహరించే అధికారులు మారరు. సెలవుల మంజూరుకు అనుమతించకుండా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, టీచర్లకు అన్యాయం చేస్తున్న విద్యాశాఖ అధికారులపై వచ్చే ఫిర్యాదులపై రాష్ట్ర ఉన్నతాధికారులు సైతం సత్వరం స్పందించాలి. లీవ్ రూల్స్ లో ప్రభుత్వం పొందుపర్చిన వెసులుబాటు ఇవ్వడానికి నిరాకరించే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.

ఆగ‌స్టు 1 నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు

తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు ఆగ‌స్టు 1 నుంచి నిర్వ‌హించనున్న‌రు. ఈ ప‌రీక్ష‌లు 10వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతాయి. ఉద‌యం 9:30 నుంచి మ‌ధ్యాహ్నం 12:45 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు జులై 18వ తేదీ లోపు సంబంధిత పాఠ‌శాల‌ల్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
అడ్వాన్స్‌డ్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల టైం టేబుల్ ఇదే..

ఆగ‌స్టు 1 – ఫ‌స్ట్ లాంగ్వేజ్
ఆగ‌స్టు 2 – సెకండ్ లాంగ్వేజ్
ఆగ‌స్టు 3 – థ‌ర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్‌)
ఆగ‌స్టు 4 – మ్యాథ‌మేటిక్స్
ఆగ‌స్టు 5 – జ‌న‌ర‌ల్ సైన్స్(ఫిజిక‌ల్ సైన్స్, బ‌యాల‌జీ)
ఆగ‌స్టు 6 – సోష‌ల్ స్ట‌డీస్
ఆగ‌స్టు 8 – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్ -1
ఆగ‌స్టు 10 – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్ -2

All Updates

TSLPRB Updates

TET DSC Gurukula Updadtes

Job Notifications

Important Links

Centran Jobs Updates

TSPSC VRO FInal Merit Lists and Cut off Marks

Important Links

TSPSCvro District wise Reservation wise Marks and Merit lists

Top